హోటల్ యజమానులకు గుడ్ న్యూస్.. సబ్సిడీలతో సర్కార్ బంపర్ ఆఫర్!
గల్ఫ్ ప్రాంతంలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావంతో ఎల్పిజి సరఫరాలో అంతరాయం ఏర్పడుతున్న నేపథ్యంలో సీఎం స్టాలిన్ నేతృత్వంలోని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్పిజి వినియోగాన్ని తగ్గించి ఎలక్ట్రిక్ స్టవ్ల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు రెస్టారెంట్లు, టీ షాపులు, క్లౌడ్ కిచెన్లు, ఇతర ఆహార ఉత్పత్తి యూనిట్లకు ప్రతి యూనిట్కు ₹2 విద్యుత్ సబ్సిడీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
ఈ మేరకు చెన్నై సచివాలయంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం అనంతరం ముఖ్యమంత్రి ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ఎల్పిజి సరఫరా పరిమితులు, వాణిజ్య రంగం ఎదుర్కొంటున్న సమస్యలు, పరిశ్రమలపై పడుతున్న ప్రభావం వంటి అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. కేంద్ర ప్రభుత్వం వాణిజ్య ఎల్పిజి వినియోగంపై విధించిన ఆంక్షలు కొనసాగుతున్నంత వరకు ఈ సబ్సిడీ అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు.

చిన్న పరిశ్రమలకు ఆర్థిక సహాయం..
సబ్సిడీతో పాటు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (MSMEలు) ఎలక్ట్రిక్ స్టవ్లు, హీటర్లు వంటి పరికరాలు కొనుగోలు చేయడానికి ప్రత్యేక రుణ సదుపాయాలు కూడా అందించనున్నారు.
Unemployed Youth Employment Generation Programme కింద అర్హులైన యువ పారిశ్రామికవేత్తలు ₹3.75 లక్షల వరకు 25% సబ్సిడీ పొందే అవకాశం ఉంటుంది. అలానే మహిళా వ్యాపారులను ప్రోత్సహించేందుకు Tamil Nadu Women Entrepreneur Development Scheme కింద ₹10 లక్షల రుణంపై ₹2 లక్షల వరకు సబ్సిడీ అందించనున్నారు. ఇది మహిళలు ఆహార ప్రాసెసింగ్, కిచెన్ యూనిట్లు, చిన్న రెస్టారెంట్లు ప్రారంభించేందుకు సహాయపడుతుంది.
ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక పథకం..
షెడ్యూల్డ్ కులాలు, తెగల వ్యాపారులకు Annai Ambedkar Business Champions Scheme కింద ₹1 కోటి వరకు పెట్టుబడిపై 35% మూలధన సబ్సిడీ ఇవ్వనున్నారు. అధిక సామర్థ్యం గల ఎలక్ట్రిక్ యంత్రాలు, ఆధునిక ఉత్పత్తి పరికరాలు కొనుగోలు చేయడానికి ఈ పథకం ఉపయోగపడుతుంది.
ప్రత్యామ్నాయ ఇంధనాలకు అనుమతి..
తమిళనాడులో ప్రస్తుతం కాలుష్య నియంత్రణ మండలి అనుమతితో నడుస్తున్న 60,698 కర్మాగారాలు ఉన్నాయి. వీటిలో చాలా వరకు ఎల్పిజి, సిఎన్జి, డీజిల్, ఫర్నేస్ ఆయిల్, వంటచెరకు వంటి ఇంధనాలను ఉపయోగిస్తున్నాయి. ఎల్పిజి కొరత కారణంగా ఈ పరిశ్రమలు తాత్కాలికంగా కిరోసిన్, బయోమాస్, హైస్పీడ్ డీజిల్ (HSD), రిఫ్యూజ్-డిరైవ్డ్ ఫ్యూయల్ (RDF) వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలకు మారేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
అనుమతుల ప్రక్రియ..
ఈ మార్పు కోసం కొత్తగా "స్థాపనకు అనుమతి (CTE)" లేదా "నిర్వహణకు అనుమతి (CTO)" తీసుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. కేవలం కాలుష్య నియంత్రణ మండలికి ముందుగా సమాచారం ఇవ్వడం సరిపోతుంది.
మరోవైపు రాష్ట్రంలోని 9,300 ప్రాథమిక పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలు రోజుకు సుమారు 5.5 మిలియన్ లీటర్ల పాలను నిర్వహించే సామర్థ్యం కలిగి ఉన్నాయి. ఎల్పిజి సంక్షోభం వల్ల పాల వినియోగం తగ్గే ప్రమాదం ఉండటంతో Aavin రైతుల నుంచి వచ్చే అదనపు పాలను ఎటువంటి పరిమితులు లేకుండా కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెస్టారెంట్లు మూతపడటం వల్ల రైతుల ఉత్పత్తుల అమ్మకాలు తగ్గకుండా ఉండేందుకు రాష్ట్రంలోని 194 ఉజవర్ సంతైల్ (రైతు బజార్లు)లో కూరగాయలు, పండ్ల విక్రయాలపై ఉన్న కొన్ని ఆంక్షలను ప్రభుత్వం ఎత్తివేసింది. దీంతో రైతులు తమ ఉత్పత్తులను సులభంగా మార్కెట్ చేయగలుగుతారు.
ఎల్పిజి పంపిణీ పర్యవేక్షణ కమిటీ..
వాణిజ్య సంస్థలకు ఎల్పిజి సిలిండర్ల సరైన పంపిణీని నిర్ధారించేందుకు ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో రాష్ట్ర స్థాయి పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో కమిటీలు ఏర్పడి ఆయిల్ కంపెనీలతో కలిసి పంపిణీని పర్యవేక్షిస్తాయి. ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ కార్డుదారులకు 3,228 కిలోలీటర్ల అదనపు కిరోసిన్ సరఫరా చేశారు. పెట్రోల్, డీజిల్ నిల్వలు ఒక నెలపాటు సరిపోతాయని చమురు కంపెనీల సమన్వయకర్తలు తెలిపారు.
పట్టణ ప్రాంతాల్లో సాధారణంగా గ్యాస్ సిలిండర్ల సరఫరా ప్రతి 25 రోజులకు ఒకసారి జరుగుతుంది. ప్రస్తుత సంక్షోభ సమయంలో ఆసుపత్రులు, పాఠశాలలు, కళాశాల హాస్టళ్లకు ఎల్పిజి సరఫరాకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇంధన సరఫరా పరిస్థితిని సమీక్షించేందుకు ముఖ్యమంత్రి ఇప్పటికే మార్చి 10న ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. అనంతరం ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు, హోటల్ యజమానుల సంఘాలతో సమావేశమయ్యారు. పరిశ్రమ ప్రతినిధులు తమ సమస్యలు, డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేశారు.
సమావేశంలో పాల్గొన్న అధికారులు..
మార్చి 14 సమావేశంలో ప్రధాన కార్యదర్శి మురుగానందం, పర్యావరణ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి సుప్రియా సాహు, జె. రాధాకృష్ణన్, హోం శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి ధీరజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అలాగే పరిశ్రమలు, మున్సిపల్ పరిపాలన, ఆహార సరఫరా, పశుసంవర్ధక శాఖలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు కూడా ఈ చర్చల్లో పాల్గొన్నారు.
-
"అప్పుడు వేరు.. ఇప్పుడు వేరు": భారత్ స్థానం మారింది - ప్రధాని మోడీ -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !!












Click it and Unblock the Notifications