సైరస్ మిస్త్రీ ఎఫెక్ట్: టాటా గ్రూప్కు రూ.55వేల కోట్ల భారీ నష్టం
ముంబై: టాటా సన్స్ గ్రూప్ చైర్మన్గా సైరస్ మిస్త్రీని తొలగించిన అనంతరం కలకలం చెలరేగుతోంది. ఆయన తొలగింపుపై ఓ వైపు ఏం జరిగి ఉంటుందే చర్చ జరుగుతుండగానే, బోర్డు సభ్యులకు ఆయన పంపిన ఘాటు ఈమెయిల్ కలకలం రేపింది. వెంటనే టాటా తరఫు లాయర్ కూడా మిస్త్రీ పైన మండిపడ్డారు.
బోర్డు పిచ్చిదనుకుంటున్నావా: సైరస్ మిస్త్రీపై టాటా లాయర్ అభిషేక్
టాటా గ్రూప్లో ప్రకంపనల నేపథ్యంలో మార్కెట్లో గత మూడెళ్లలో ఎన్నడు లేనంత నష్టం సంభవించింది. ఈ మూడు రోజుల్లో టాటా కంపెనీకు రూ.55వేల కోట్ల నష్టం వచ్చింది. తాజ్ హోటల్ గ్రూప్కు చెందిన ఇండియన్ హోటల్ కంపెనీ పది నుంచి 13 శాతానికి పడిపోయింది.

కాగా, అనూహ్య రీతిలో టాటా గ్రూప్ నుంచి తొలగింపునకు గురయిన సైరస్ మిస్త్రీ నిన్న పలు ఆరోపణల అస్త్రాలు వదిలారు. గ్రూపులో తనను అసమర్థ ఛైర్మన్ కిందకు జమకట్టి, నిర్ణయాధికార ప్రక్రియలో మార్పులు చేశారని, ప్రత్యామ్నాయ శక్తులకు సృష్టించారని టాటా సన్స్ బోర్డు డైరెక్టర్లకు రాసిన లేఖలో ఆయన విరుచుకుపడ్డారు.
మంగళవారమే ఈ రహస్య లేఖ రాసినప్పటికీ అది బుధవారం మీడియా చేతికి చిక్కింది. సహేతుక కారణం చూపకుండా, ఎలాంటి వివరణ తీసుకోకుండా, భారత్లోనే అతిపెద్ద కార్పొరేట్ దిగ్గజ సంస్థలో ఒక ఛైర్మన్ను తొలగించారని పేర్కొన్నారు. కార్పొరేట్ చరిత్రలో ఇది మచ్చగా మిగిలిపోయే అవకాశం ఉందన్నారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications