హిట్ అండ్ రన్: రోడ్డు దాటుతూ టీసీఎస్ మహిళా టెక్కీ మృతి
ముంబై: మహారాష్ట్రలోని గుర్గావ్ వద్ద నాలుగు రోజుల క్రితం హిట్ అండ్ రన్ ఘటన చోటు చేసుకుంది. గుర్గావ్ ప్రాంతంలోని వన్రాయ్ పోలీసు స్టేషన్ ఎదుట జరిగిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)లో సాఫ్టువేర్ ఇంజనీర్గా పని చేస్తున్న యువతి అర్చన పాండ్య (22) దుర్మరణం చెందారు.
అంధేరీలో నివసిస్తున్న అర్చన బుధవారం రాత్రి విధులు ముగించుకొని ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో వేగంగా దూసుకు వచ్చిన ఓ కారు ఆమెను ఢీకొట్టింది. నిందితులు ప్రమాదం జరిగగానే వెంటనే అక్కడి నుండి పారిపోయారు.
ఆమె కిందపడిపోయారు. స్థానికులు చూసేసరికి ఆమె మృత్యువాత పడ్డారు. ఆ వాహనం ఢీకొట్టిన అనంతరం ఆమె దాదాపు అరగంట పాటు రక్తపుమడుగులో పడి ఉంది. ఆమె రోడ్డు క్రాస్ చేస్తుండగా ఈ సంఘటన జరిగింది. మరోవైపు, ఈ సంఘటన పోలీసు స్టేషన్ సమీపంలోనే జరిగింది. దీనిపై కేసు నమోదు చేసుకున్నట్లు గుర్గావ్ ఈస్ట్ పోలీసులు శనివారం నాడు తెలిపారు.