వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీచర్ పైశాచికం: కత్తెరతో దాడి చేసి, ఐదో తరగతి విద్యార్థినిని బాల్కనీ నుంచి విసిరేసింది

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తల్లిదండ్రుల తర్వాత అంత ప్రాధాన్యం కలిగిన స్థానంలో ఉన్న ఓ ఉపాధ్యాయురాలు.. పాఠశాల విద్యార్థినిపై పైశాచికంగా దాడి చేశారు. ఐదో తరగతి విద్యార్థినిని తీవ్రంగా కొట్టిన ఉపాధ్యాయురాలు.. ఆ తర్వాత భవనంపైనుంచి కిందికి తోసేసింది.

ఈ ఘటన ఢిల్లీ నగర్ నిగమ్ బాలిక విద్యాలయలో చోటు చేసుకుంది. పాఠశాల భవనం మొదటి అంతస్తు నుంచి తోసేయడంతో వందన అనే విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమె పరిస్థితి కొంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. బాలిక ప్రస్తుతం బారా హిందూరావు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

 Teacher Attacks Class 5 Girl With Scissors, Throws Her from School Balcony, Delhi

శుక్రవారం ఉదయం 11.15 గంటలకు జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితురాలైన ఉపాధ్యాయులు రాలు గీతా దేశ్వాల్‌ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

కాగా, పాఠశాల భవనంపైనుంచి విద్యార్థిని తోసేసే ముందే వందనపై కత్తెరతో దాడి చేసినట్లు తెలుస్తోంది. విద్యార్థిని కొడుతున్న సమయంలో మరో ఉపాధ్యాయురాలు రియా అడ్డుకునే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ గీత దాడికి పాల్పడింది.

ఘటనపై బాలిక తల్లిదండ్రులు, బంధులు ఆందోళన వ్యక్తం చేశారు. సదరు టీచర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

English summary
Teacher Attacks Class 5 Girl With Scissors, Throws Her from School Balcony, Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X