షాక్: క్లాస్లో విద్యార్థినుల దుస్తులు విప్పించిన టీచర్
జైపూర్: రాజస్థాన్లో ఓ టీచర్ అత్యంత దారుణంగా ప్రవర్తించింది. దొంగతనం చేశారనే అనుమానంతో తరగతి గదిలోని అమ్మాయిల దుస్తులను విప్పించి, తనిఖీలు చేసింది. అయితే, తీరా తనిఖీల్లో ఏమీ దొరకలేదు.
ఈ సంఘటన రజనంగావ్ జిల్లాలో జరిగింది. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన ఉపాధ్యాయురాలే విద్యార్థుల పట్ల దారుణంగా ప్రవర్తించి, వారిని తరగతి గదిలో అవమానించింది. సమాచారం మేరకు... జంగల్పూర్ హయ్యర్ సెకండరీ స్కూల్లో ఇది జరిగింది.

ఆ పాఠశాల 11వ తరగతి గదిలో రెండు వేల రూపాయలు దొంగిలించబడ్డాయి. అవి దొంగిలించారన్న అనుమానంతో ముగ్గురు విద్యార్థినుల దుస్తులను తరగతి గదిలోనే విప్పించి టీచర్ సోదాలు చేసింది. కానీవారి వద్ద ఏమీ దొరకలేదు.
అందులో ఓ విద్యార్థిని జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. ఈ విషయమై డీఈవోకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరుగుతోంది. తమను దుస్తులు విప్పించి చూడటంతో... ఆ ముగ్గురు విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు నిరాకరిస్తున్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications