షాక్: క్లాస్లో విద్యార్థినుల దుస్తులు విప్పించిన టీచర్
జైపూర్: రాజస్థాన్లో ఓ టీచర్ అత్యంత దారుణంగా ప్రవర్తించింది. దొంగతనం చేశారనే అనుమానంతో తరగతి గదిలోని అమ్మాయిల దుస్తులను విప్పించి, తనిఖీలు చేసింది. అయితే, తీరా తనిఖీల్లో ఏమీ దొరకలేదు.
ఈ సంఘటన రజనంగావ్ జిల్లాలో జరిగింది. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన ఉపాధ్యాయురాలే విద్యార్థుల పట్ల దారుణంగా ప్రవర్తించి, వారిని తరగతి గదిలో అవమానించింది. సమాచారం మేరకు... జంగల్పూర్ హయ్యర్ సెకండరీ స్కూల్లో ఇది జరిగింది.
ఆ పాఠశాల 11వ తరగతి గదిలో రెండు వేల రూపాయలు దొంగిలించబడ్డాయి. అవి దొంగిలించారన్న అనుమానంతో ముగ్గురు విద్యార్థినుల దుస్తులను తరగతి గదిలోనే విప్పించి టీచర్ సోదాలు చేసింది. కానీవారి వద్ద ఏమీ దొరకలేదు.
అందులో ఓ విద్యార్థిని జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. ఈ విషయమై డీఈవోకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరుగుతోంది. తమను దుస్తులు విప్పించి చూడటంతో... ఆ ముగ్గురు విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు నిరాకరిస్తున్నారు.