బెంగళూరులో ఫస్ట్ త్రిబుల్ తలాక్ కేసు, చిక్కుల్లో టెక్కీ: రూ. 30 లక్షలు దొబ్బాడు !
బెంగళూరు: త్రిబుల్ తలాక్ బిల్లు అమలులోకి వచ్చిన తరువాత భార్య దగ్గరకు వెళ్లి తలాక్ తలాక్ తలాక్ అని చెప్పిన భర్త మీద బెంగళూరులో మొట్ట మొదటి కేసు నమోదు అయ్యింది. ఉద్యోగం ఉందని పొగరుతో తనకు తలాక్ పేరుతో విడాకులు ఇవ్వాలని భర్త వేధింపులకు గురి చేస్తున్నాడని, ఇప్పటికే కట్నం కింద రూ. 30 లక్షలు తీసుకున్నాడని, తాను న్యాయపోరాటం చేస్తానని అంటున్న ఓ మహిళ సాఫ్ట్ వేర్ ఇంజనీరు మీద బెంగళూరులో మొట్ట మొదటి కేసు పెట్టంది.
బెంగళూరులోని గుర్రప్పనపాళ్యలో సమీరుల్లా రెహమత్ (38) అనే సాఫ్ట్ వేర్ ఇంజనీరు నివాసం ఉంటున్నాడు. ప్రసిద్ది చెందిన విప్రో కంపెనీలో సమీరుల్లా రెహమత్ సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్నాడు. ఇతని భార్య దుబాయ్ లో ఇంజనీరింగ్ విద్యాభ్యాసం పూర్తి చేసింది.

2010 లో సమీరుల్లా రెహమత్, ఆమె కుటుంబ సభ్యులు ఇద్దరి పెళ్లి జరిపించారు. పెళ్లి సమయంలో రూ. 7.50 లక్షల విలువైన కారు, రూ. 10 లక్షలు కట్నం కింద సమీరుల్లా రెహమత్ కు ఇచ్చారని సమాచారం. సమీరుల్లా రెహమత్ దంపతులకు ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు.
ఒక సంవత్సరం క్రితం దంపతుల మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలో ఇరు కుటుంబ సభ్యులు, మతపెద్దలు ఇద్దరికి నచ్చచెప్పి బుధ్దిమాటలు చెప్పారు. తరువాత సమీరుల్లా రెహమత్ కు అదనంగా మరో రూ. 7 లక్షలు కట్నం ఇచ్చారు. భార్యను బీటీఎం లేఔట్ ప్రత్యేకంగా ఇల్లు తీసుకుని సమీరుల్లా రెహమత్ నివాసం ఉంటున్నాడు.
అయితే సమీరుల్లా రెహమత్ బీటీఎం లేఔట్ లోని భార్య ఇంటికి వెళ్లడం లేదు. ఇటీవల ఒక రోజు నేరుగా భార్య ఇంటికి వెళ్లిన సమీరుల్లా రెహమత్ తలాక్ తలాక్ తలాక్ అంటూ మూడు సార్లు భార్యకు చెప్పి నీకు విడాకులు ఇస్తున్నానని, నీకు దిక్కున్నచోట చెప్పుకో అని వెళ్లిపోయాడు. తాను ఎంత చెప్పినా తన భర్త సమీరుల్లా రెహమత్ వినడం లేదని, అనవసరంగా విడాకులు ఇచ్చాడని అతని భార్య ఫిర్యాదు చేశారని, కేసు విచారణలో ఉందని సుందగుంటపాళ్య పోలీసులు తెలిపారు.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!











Click it and Unblock the Notifications