రేప్: బాలిక స్నానం చేస్తుంటే.. బాత్రూమ్లోకి చొచ్చుకెళ్లి..
బాలిక కదలికలను గమనిస్తున్న మహేంద్ర బైరాగీ(28) అనే స్థానిక యువకుడు.. ఆమె స్నానం చేస్తున్న సమయంలో బాత్రూమ్ లోకి చొచ్చుకెళ్లాడు.
కోట: స్నానం చేయడం కోసం బాత్రూమ్లోకి వెళ్లిన బాలికపై ఓ యువకుడు కన్నేశాడు. అమాంతం బాత్రూమ్లోకి చొచ్చుకుపోయి.. ఆమెను బలవంతం చేశాడు. చివరికి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టి అక్కడినుంచి పారిపోయాడు.
రాజస్థాన్ రాష్ట్రంలోని బరాన్ జిల్లా చబ్దా పట్టణంలో ఆదివారం నాడు ఈ ఘటన చోటు చేసుకుంది. చబ్దా పట్టణంలోని ఓ ఇంట్లో 15ఏళ్ల బాలిక స్నానం చేయడం కోసం బాత్రూమ్ లోకి వెళ్లింది. బాలిక కదలికలను గమనిస్తున్న మహేంద్ర బైరాగీ(28) అనే స్థానిక యువకుడు.. ఆమె స్నానం చేస్తున్న సమయంలో బాత్రూమ్ లోకి చొచ్చుకెళ్లాడు.

ఆమెపై అత్యాచారం జరిపి అక్కడినుంచి పరారయ్యాడు. ఘటనానంతరం బాధిత బాలిక తన తల్లితో కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. నిందితుడు మహేంద్రబైరాగీపై ఫిర్యాదు చేయడంతో ఐపీసీ సెక్షన్ 376, పోస్కో చట్టాల కింద అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న తర్వాత.. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నిందితుడు మహేంద్ర బైరాగీ కోసం పోలీసులు గాలిస్తున్నట్టుగా ఏఎస్ఐ రామ్ కరణ్ తెలిపారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications