Tehsildar: లంచం కేసులో జస్ట్ మిస్, ఉద్యోగానికి రాకుండా, కలెక్టర్ కు మెసేజ్ పంపించి జంప్ !
బెంగళూరు/మాగడి: ప్రభుత్వ ఉద్యోగం, అందులో పైసలు వచ్చే పోస్టు అయితే అలాంటి అధికారులకు రోజు పండుగే. లంచం తీసుకుంటున్న కేసులో తహసీల్దార్ ఏ 2 నిందితుడా ఉన్నాడు అలాంటి తహసీల్దార్ రెండు వారాల నుంచి మాయం కావడం కాలకలం రేపింది. లంచం తీసుకుంటున్న సమయంలో మధ్యవర్తి లోకాయుక్తకు చిక్కిపోవడంతో తహసిల్దార్ జంప్ అయ్యాడు.
రెండు వారాల నుంచి కనిపించకుండా పోయిన రామనగర జిల్లాలోని మాగడి తహసిల్దార్ శ్రీనివాస్ ఇంతవరకు కనిపించకపోవడంతో ఆయన కుటుంబబ సభ్యులు ఆందడోళన చెందుతున్నారని తెలిసింది. కర్ణాటకలోని రామనగర జిల్లా మాగాడి తాలూకా తహశీల్దార్ శ్రీనివాస్ గత మూడేళ్లుగా పని చేస్తున్నారు. జనవరి 3వ తేదీ సాయంత్రం మాగాడి తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో మధ్యవర్తిగా పనిచేస్తున్న మంజునాథ్ ఓ భూమి కేసుకు సంబంధించి ఓ వ్యక్తి నుంచి రూ 20వేలు అడ్వాన్స్గా లంచం తీసుకుంటున్న సమయంలో లోకాయుక్త అధికారులు అతన్ని పట్టుకున్నారు.

ప్రభుత్వ భూమి కేసును మాగాడి తహసీల్దార్ కోర్టులో పరిష్కరిస్తామని మధ్యవర్తి మంజునాథ్ పిటిషనర్కు హామీ ఇచ్చారు. భూవివాదాన్ని పరిష్కరించుకోవాలంటే తహసీల్దార్ శ్రీనివాస్ సార్ కు లంచం ఇవ్వాలని మంజునాథ్ అతనికి చెప్పాడు. దీంతో బాధితుడు లోకాయుక్త అధికారులు సమాచారం ఇచ్చారు. జనవరి 3వ తేదీ సాయంత్రం తహశీల్దార్ శ్రీనివాస్ కార్యాలయం ఆవరణంలోనే లోకాయుక్త దాడులు చేశారు.
తరువాత చాకచక్యంగా తప్పించుకున్న తహశీల్దార్ శ్రీనివాస్ రెండు వారాలు అయినా ఇంత వరకు కార్యాలయానికి రాకుండానే తప్పించుకుని తిరుగుతున్నాడని శుక్రవారం లోకాయుక్త అధికారులు తెలిపారు. లోకాయుక్త ఉచ్చులో పడిన నిందితుడు మంజునాథ్తోపాటు మాగాడి తహసీల్దార్ శ్రీనివాస్, ఆయనకు చాలా ఆప్తుడి మీద అధికారులు కేసు నమోదు చేశారు.
మంజునాథ్ అరెస్ట్ అయిన తరువాత తనకు సెలవు కావాలని తహశీల్దార్ శ్రీనివాస్ రామనగర జిల్లా మెజిస్ట్రేట్కు మెసేజ్ పంపించారు. తరువాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన తహసిల్దార్ శ్రీనివాస్ మాయం అయిపోయాడని అధికారులు అంటున్నారు. ప్రభుత్వ అధికారి ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా లంచం కేసులో తప్పించుకుని తిరగడంతో లోకాయుక్త పోలీసులు సీరియస్ గా ఉన్నారని తెలిసింది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications