Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

శత్రు దేశాలకు వణుకుపుట్టే నిర్ణయం తీసుకున్న కేంద్రం

న్యూఢిల్లీ: శత్రువుల మదిలో మరింత భయాన్ని పెంచేందుకు భారత్​ సైన్యాన్ని మరింత పటిష్ఠం చేసేందుకు రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రూ.2.23 లక్షల కోట్ల విలువ గల తేజస్​ యుద్ధ విమానాలు, ప్రచండ్ హెలికాప్టర్ల కొనుగోలుకు కేంద్ర రక్షణ శాఖ ఆమోదం తెలిపింది.

భారత సాయుధ బలగాల కోసం 97 తేజస్​ తేలికపాటి యుద్ధవిమానాలు, 156 ప్రచండ్ హెలికాప్టర్లను కొనుగోలుకు రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. వీటి కొనుగోలుకు సుమారు రూ. 2.23 లక్షల కోట్లు అవుతున్నట్లు అంచనా. దీంతో పాటు వాయుసేనకు చెందిన సుఖోయ్-30 యుద్ధ విమానాలను అప్​గ్రేడ్​ ప్రోగ్రాం​కు కూడా ఆమోదం తెలిపింది.

 Tejas war flights: india to order 97 fighter jets 56 prachand choppers for over nearly 2.5 lakh crore

రక్షణశాఖ మంత్రి రాజ్ ​నాథ్​ సింగ్ నేతృత్వంలో సమావేశమైన డిఫెన్స్ అక్వైజిషన్‌ కౌన్సిల్(డీఏసీ) ఈ ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేసింది. ఈ రెండు రకాల విమానాలను 98 శాతం స్వదేశీ పరిజ్ఞానంతోనే అభివృద్ధి చేస్తున్నట్లు రక్షణశాఖ పేర్కొంది. అయితే తేజస్​ మార్క్-1ఏ యుద్ధ విమానాలు వాయుసేన కోసం.. 156 హెలికాప్టర్లను వాయుసేన, ఇండియన్ ఆర్మీ అవసరాలకు కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది.

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL).. సుఖోయ్-30 యుద్ధ విమానాలను అప్​గ్రేడ్​ చేయనున్నట్లు రక్షణ శాఖ వెల్లడించింది.2021లో రక్షణశాఖ.. వైమానిక దళం కోసం 83 తేజస్​ మార్క్-1ఏ యుద్ధ విమానాల కొనుగోలుకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్​తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పుడు కొనుగోలు చేస్తున్న విమానాలతో కలుపుకుంటే తేజస్​ యుద్ధ విమానాలు సంఖ్య 180 కు చేరుకోనుంది. దీంతో శత్రుదేశాలైన పాకిస్థాన్, చైనాలకు గట్టి హెచ్చరిక ఇచ్చినట్లవుతుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+