శత్రు దేశాలకు వణుకుపుట్టే నిర్ణయం తీసుకున్న కేంద్రం
న్యూఢిల్లీ: శత్రువుల మదిలో మరింత భయాన్ని పెంచేందుకు భారత్ సైన్యాన్ని మరింత పటిష్ఠం చేసేందుకు రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రూ.2.23 లక్షల కోట్ల విలువ గల తేజస్ యుద్ధ విమానాలు, ప్రచండ్ హెలికాప్టర్ల కొనుగోలుకు కేంద్ర రక్షణ శాఖ ఆమోదం తెలిపింది.
భారత సాయుధ బలగాల కోసం 97 తేజస్ తేలికపాటి యుద్ధవిమానాలు, 156 ప్రచండ్ హెలికాప్టర్లను కొనుగోలుకు రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. వీటి కొనుగోలుకు సుమారు రూ. 2.23 లక్షల కోట్లు అవుతున్నట్లు అంచనా. దీంతో పాటు వాయుసేనకు చెందిన సుఖోయ్-30 యుద్ధ విమానాలను అప్గ్రేడ్ ప్రోగ్రాంకు కూడా ఆమోదం తెలిపింది.

రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలో సమావేశమైన డిఫెన్స్ అక్వైజిషన్ కౌన్సిల్(డీఏసీ) ఈ ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేసింది. ఈ రెండు రకాల విమానాలను 98 శాతం స్వదేశీ పరిజ్ఞానంతోనే అభివృద్ధి చేస్తున్నట్లు రక్షణశాఖ పేర్కొంది. అయితే తేజస్ మార్క్-1ఏ యుద్ధ విమానాలు వాయుసేన కోసం.. 156 హెలికాప్టర్లను వాయుసేన, ఇండియన్ ఆర్మీ అవసరాలకు కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది.
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL).. సుఖోయ్-30 యుద్ధ విమానాలను అప్గ్రేడ్ చేయనున్నట్లు రక్షణ శాఖ వెల్లడించింది.2021లో రక్షణశాఖ.. వైమానిక దళం కోసం 83 తేజస్ మార్క్-1ఏ యుద్ధ విమానాల కొనుగోలుకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పుడు కొనుగోలు చేస్తున్న విమానాలతో కలుపుకుంటే తేజస్ యుద్ధ విమానాలు సంఖ్య 180 కు చేరుకోనుంది. దీంతో శత్రుదేశాలైన పాకిస్థాన్, చైనాలకు గట్టి హెచ్చరిక ఇచ్చినట్లవుతుంది.
-
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
BCCI కు ఆ లక్కీ ఛాంప్ ఎలా దొరికింది? ప్రార్థన చేసి.. ప్రపంచ కప్ గెలిచి.. -
చైనా బాటలోనే రష్యా-ఇరాన్ సుప్రీం లీడర్ కు భారీ ఊరట..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..! -
భారత్ గెలిస్తే ఏంటట: పాకిస్తానోళ్లు కడుపు మంటతో పోయేట్టున్నారయ్యో -
T20 World Cup Final: నోర్మూయిస్తాం..! చాలా చూశాం..! ఫైనల్ వేళ శాంట్నర్ వర్సెస్ సూర్య..! -
India Post GDS Result 2026: పోస్టాఫీస్ జాబ్స్ మెరిట్ లిస్ట్ విడుదల-ఇలా చెక్ చేసుకోండి..! -
Adani Total Gas: గృహ వినియోగదారులకు ఊరట.. పరిశ్రమలకు గ్యాస్ సరఫరా తగ్గింపు -
బరువు తగ్గాలంటే చనా వెజ్ సలాడ్ ఇలా ట్రై చెయ్యండి! -
టీమిండియాకు టీ20 కెప్టెన్ షాక్? రిటైర్మెంట్ వార్తలు నిజమేనా? -
పాకిస్థాన్ ఖేల్ ఖతం.. లీటర్ పెట్రోల్ రూ. 321, డీజిల్ రూ. 335.. -
మనం మనం బరంపురం.. !!











Click it and Unblock the Notifications