Miss India World టైటిల్ నెగ్గిన తెలుగమ్మాయి మానస వారణాసి: ఎవరీ అమ్మాయి..?
మిస్ ఇండియా వరల్డ్కు జరిగిన పోటీల్లో తెలంగాణకు చెందిన మానస వారణాసి విజేతగా నిలిచింది. 23 ఏళ్ల ఈ ముద్దుగుమ్మ ఇంజినీరింగ్ చేసింది. ఇదిలా ఉంటే హరియానాకు చెందిన మానికా షియోకంద్ వీఎల్సీసీ ఫెమినా మిస్ గ్రాండ్ ఇండియా 2020గా నిలిచింది. ఇక ఫెమినా మిస్ ఇండియా 2020 రన్నరప్గా ఉత్తర్ ప్రదేశ్కు చెందిన మాన్యా సింగ్ నిలిచింది.
బుధవారం అంగరంగ వైభవంగా జరిగిన ఈ పోటీల్లో హైదరాబాద్ అమ్మాయి మానసా వారణాసి మిస్ ఇండియా వరల్డ్ కిరీటంను దక్కించుకుంది. ఈ కాంపీటీషన్కు న్యాయనిర్ణేతలుగా ప్రముఖ బాలీవుడ్ నటి నేహా ధూపియా, చిత్రాంగద సింగ్, పుల్కిత్ సామ్రాట్, ప్రముఖ డిజైనర్ ద్వయం ఫాల్గుణీ మరియు షేన్ పీకాక్లు వ్యవహరించారు. పేజెంట్ తొలి రౌండ్ను 2019 మిస్ వరల్డ్ ఏషియా సుమన్ రావు ప్రారంభించారు.

హైదరాబాదులో నివాసం ఉంటున్న మానస వారణాసి ఇంజినీరింగ్ పూర్తి చేసింది. ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ఛేంజ్ అనలిస్టుగా ప్రస్తుతం పనిచేస్తోంది. డిసెంబర్ 2021లో జరిగే 70వ మిస్ వరల్డ్ పోటీల్లో భారత్ తరపున మానస పాల్గొంటుంది. ఇక మిస్ ఇండియా వరల్డ్ 2020గా నిలిచిన మానసకు 2019 మిస్ ఇండియా వరల్డ్ సుమన్ రతన్ సింగ్ రావు కిరీటం బహుకరించారు.




-
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ












Click it and Unblock the Notifications