జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదుల దుశ్చర్య: మరో టీచర్ హత్య; సామాన్యులపై వరుస దాడులతో టెన్షన్!!

జమ్మూకాశ్మీర్లో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. కాశ్మీర్ ప్రాంతంలోని కుల్గామ్ జిల్లాలో ఒక హిందూ పాఠశాల ఉపాధ్యాయురాలిని ఉగ్రవాదులు కాల్చిచంపారు. కుల్గామ్‌లోని గోపాల్‌పోరా ప్రాంతంలోని ఓ ఉన్నత పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది.

మరో ఉపాధ్యాయురాలిని హతమార్చిన టెర్రరిస్ట్ లు

మరో ఉపాధ్యాయురాలిని హతమార్చిన టెర్రరిస్ట్ లు


జమ్మూ ప్రాంతంలోని సాంబా నివాసి అయిన 36 ఏళ్ల రజనీ బాలా కుల్గామ్‌లోని గోపాల్‌పోరా ప్రాంతంలో టీచర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమెపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఆమెకు గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ దారుణానికి పాల్పడిన ఉగ్రవాదులను త్వరలోనే గుర్తించి మట్టుబెడతామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టారు.

టీచర్ హత్యను ఖండించిన ఒమర్ అబ్దుల్లా

టీచర్ హత్యను ఖండించిన ఒమర్ అబ్దుల్లా


టీచర్‌పై జరిగిన దాడిని నేషనల్ కాన్ఫరెన్స్ వైస్ ప్రెసిడెంట్ ఒమర్ అబ్దుల్లా "నీచమైన" చర్యగా అభివర్ణించారు. రజనీ జమ్మూ ప్రావిన్స్‌లోని సాంబా జిల్లాకు చెందినవారు. దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గామ్ ప్రాంతంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, టెర్రరిస్ట్ ల దాడిలో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఆమె భర్త రాజ్ కుమార్ , ఆమె కుటుంబంలోని మిగిలిన వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం అంటూ ఆయన పేర్కొన్నారు. హింస వల్ల మరో ఇల్లు కోలుకోలేని విధంగా దెబ్బతింది అని ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు.

ఇటీవల పెరిగిపోయిన సామాన్య పౌరులపై టెర్రరిస్ట్ ల దాడులు

ఇటీవల పెరిగిపోయిన సామాన్య పౌరులపై టెర్రరిస్ట్ ల దాడులు


నిరాయుధ పౌరులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు ఇటీవలి దాడులకు పాల్పడుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇదిలా ఉంటే ఇటీవల, సెంట్రల్ కాశ్మీర్‌లోని బుద్గామ్ జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగి రాహుల్ భట్‌ను అతని కార్యాలయంలో ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ ప్రాంతంలో భారీ నిరసనలు చెలరేగాయి. మిస్టర్ భట్‌ను మూడు వారాల క్రితం చాదూరా పట్టణంలోని తహసీల్ కార్యాలయంలో ఉగ్రవాదులు కాల్చి చంపారు. అతను 2010-11లో వలసదారుల కోసం ప్రత్యేక ఉపాధి ప్యాకేజీ కింద క్లర్క్ ఉద్యోగం పొందాడు.

 టిక్ టాక్ స్టార్ అమ్రీన్ భట్ కాల్చివేత

టిక్ టాక్ స్టార్ అమ్రీన్ భట్ కాల్చివేత


కేవలం వారం రోజుల క్రితం, బుద్గామ్ జిల్లాలో 35 ఏళ్ల సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అమ్రీన్ భట్‌ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ దాడిలో మహిళ మేనల్లుడు 10 ఏళ్ల బాలుడు కూడా గాయపడ్డాడు. లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఈ నెలలో కాశ్మీర్‌లో జరిగిన ఏడో హత్య ఇది. బాధితుల్లో ముగ్గురు డ్యూటీలో లేని పోలీసులు కాగా, నలుగురు పౌరులు.

టెర్రర్ ఆపరేషన్ నిర్వహిస్తున్న పోలీసులు .. తుపాకీల మోతతో కాశ్మీర్

టెర్రర్ ఆపరేషన్ నిర్వహిస్తున్న పోలీసులు .. తుపాకీల మోతతో కాశ్మీర్


ఉగ్రవాదులు టార్గెట్ చేస్తూ చేస్తున్న హత్యలు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు, భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఈరోజు తెల్లవారుజామున పుల్వామా జిల్లాలో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు పోలీసులు తెలిపారు. వారి ప్రకారం, మరణించిన ఉగ్రవాదులలో ఒకరు పౌర హత్యలకు పాల్పడ్డారు. భద్రతా బలగాలు యాంటీ టెర్రర్ ఆపరేషన్ ప్రారంభించిన తర్వాత సోమవారం అర్థరాత్రి పుల్వామా జిల్లాలోని అవంతిపొరా ప్రాంతంలోని రాజ్‌పోరాలో ఎన్‌కౌంటర్ జరిగిందని పోలీసు అధికారి తెలిపారు.

ఉగ్రవాదుల ఎన్ కౌంటర్ లపై కాశ్మీర్ పోలీసులు

ఉగ్రవాదుల ఎన్ కౌంటర్ లపై కాశ్మీర్ పోలీసులు

ఇటీవలి ఎన్‌కౌంటర్లలో, జమ్మూ కాశ్మీర్‌లోని ఉగ్రవాద గ్రూపులు లష్కరే తోయిబా (ఎల్‌ఇటి), జైష్-ఎ-మహ్మద్‌లకు అనుబంధంగా ఉన్న 26 మంది విదేశీ ఉగ్రవాదులను భద్రతా దళాలు సంవత్సరం మొదటి ఐదు నెలల్లో హతమార్చాయని ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కాశ్మీర్ జోన్ విజయ్ కుమార్ తెలిపారు. ఇంకా ఉగ్రవాదుల కోసం కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుందని, ఉగ్రమూకను మట్టుబెడతామని చెప్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+