కూతురు రాఖీ కట్టడానికి కొడుకు లేడు, దంపతులు ఏం చేశారంటే, షాక్ మీద షాక్ !
న్యూఢిల్లీ/బెంగళూరు: దేశ వ్యాప్తంగా రాఖీ పండుగ సందడి ప్రారంభం కానుంది. సోదరీమణులు అన్నదమ్ములకు రాఖీ కట్టి రక్షణ కోరే రోజు. అయితే ఢిల్లీలో రాఖీ పండుగ దంపతులను జైలుపాలు చేసింది. రక్షాబంధన్ వచ్చిందంటే రాఖీ కట్టేందుకు అన్నా, తమ్ముడు లేరని కూతురు చెప్పడంతో మనస్తాపానికి గురైన తల్లిదండ్రులు 1నెల రోజుల వయసు ఉన్న బాలుడిని కిడ్నాప్ చేసిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.
ఉత్తర ఢిల్లీలోని ఠాగూర్ గార్డెన్లోని రఘుబీర్ నగర్ పోలీసులు 41 ఏళ్ల సంజయ్ గుప్తా, అతని భార్య అనితా గుప్తాను అరెస్టు చేశారు. ఏడాది క్రితం ఈ దంపతుల కుమారుడు మృతి చెందాడు. ఈసారి రక్షాబంధన్కు రాఖీ కట్టేందుకు తనకు అన్నా కాని, తమ్ముడు కాని లేరని కూతురు చెప్పడంతో ఉత్తర ఢిల్లీలో 30 రోజుల చిన్నారిని దంపతులు ఇద్దరు కిడ్నాప్ చేశారని పోలీసులు తెలిపారు.

విచారణ సందర్భంగా పోలీసులు పలు సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. ఈ సమయంలో ఫుట్పాత్ సమీపంలో ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై సంచరిస్తూ కనిపించారు. వీరిద్దరే కిడ్నాపర్లు అయి ఉంటారని పోలీసులకు అనుమానం వచ్చింది. ఆ తర్వాత 400 సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు అతడిని ఎల్ఎన్జీపీ ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులు అన్ని వివరాలను సేకరించడంతో బైక్ సంజయ్ గుప్తా పేరిట రిజిస్టర్ అయినట్లు పోలీసులు గుర్తించారు.
సంజయ్ గుప్తా ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. సంజయ్ భార్యతో కలిసి ఠాగూర్ గార్డెన్లోని రఘుబీర్ నగర్లోని సి-బ్లాక్కు వెళ్లాడు. అపహరణకు గురైన చిన్నారి కూడా అక్కడే దొరికిందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (నార్త్) సాగర్ సింగ్ కల్సి తెలిపారు. సంజయ్ గతంలో మూడు క్రిమినల్ కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications