దెబ్బకు దెయ్యం దిగింది. రెచ్చిపోయారు. బుల్డోజర్లతో రోడ్డునపడిన రౌడీలు !
గురుగ్రామ్/హరియాణ: హింసాత్మకంగా మారిన హరియానాలోని నుహ్లో అక్రమంగా నిర్మించిన ఇళ్లను కూల్చివేసే పనిలో అక్కడి ప్రభుత్వం నిమగ్నం అయ్యింది. ప్రభుత్వం చేపట్టిన బుల్డోజర్ ఆపరేషన్ దెబ్బకు రెండు వర్గాల మధ్య శత్రుత్వాన్ని ఇంకా పెంచుతోందని కొందరు ఆరోపిస్తున్నారు. అక్రమ కట్టడాల కూల్చివేత డ్రైవ్ దెబ్బతో మూడు అంతస్తులతో నిర్మించిన సహారా హోటల్ అక్రమ కట్టడాన్ని సంబంధిత అధికారులు నేలమట్టం చేశారు.
మూడు అంతస్తుల హోటల్ ను కూల్చివేయడానికి నుహ్ జిల్లా యంత్రాంగం బుల్డోజర్లను తీసుకువచ్చింది. మెడికల్ స్టోర్స్ సహా 12 షాపులను హరియాణ ప్రభుత్వం ధ్వంసం చేసింది. హింసాకాండకు గురైన నుహ్కు 20 కిలోమీటర్ల దూరంలోని టౌరులో నివసిస్తున్న వలసదారుల అక్రమ కట్టడాలను కుల్చివేసింది. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని ఇళ్లను నిర్మించారని అధికారులు అంటున్నారు.

ఇదే గుడిసెలు, ఇళ్లను ధ్వంసం చేశారని స్థానిక మీడియా తెలిపింది. కూల్చివేసిన దుకాణాలు నడుపుతున్న వారు, ఇళ్లలో నివాసం ఉంటున్న వారు ఇటీవల జరిగిన ఘర్షణల్లో పాల్గొన్న వారివేనని స్థానిక ప్రభుత్వ, పోలీసు అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు వివిధ ప్రాంతాల్లో 50 నుంచి 60 భవనాలు నేలమట్టమయ్యాయి. నుహ్ హింసకు పాల్పడిన వారు అరెస్టుకు భయపడి పారిపోయారు.

ఇదిలా ఉండగా ఇటీవల నాలుగు రోజులుగా నుహ్లోని పలు ప్రాంతాల్లో బుల్డోజర్ లో అక్రమ కట్టడాలు కూల్చి వేస్తున్న హరియాణ ప్రభుత్వం అల్లర్లలో పాల్గొన్న వారికి గట్టిగా హెచ్చరికలు జారీ చేస్తూ బుల్డోజర్లతో కఠిన చర్యలు చేపట్టింది. గత కొన్నేళ్లుగా తొలగించలేని అక్రమ ఇళ్లను తొలగించడం హింసకు పాల్పడుతున్న వారికి గుణపాఠం చెప్పడమేనని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

గత సోమవారం విశ్వహిందూ పరిషత్ ఊరేగింపుపై ఓ వర్గం వాళ్లు దాడులు చేయడంతో నుహ్లో జరిగిన మత ఘర్షణల్లో ఇద్దరు హోంగార్డులు, ఒక ఇమాత్ తో సహా ఆరుగురు చనిపోయారు. సాయంత్రం కాగానే హింస తీవ్రరూపం దాల్చింది. అర్ధరాత్రి దాటిన తర్వాత మసీదుకు నిప్పు పెట్టారు. వందకు పైగా వాహనాలు దగ్ధమై ధ్వంసమయ్యాయి. నుహ్ మరియు పొరుగున ఉన్న గురుగ్రామ్పై అల్లరిమూకలు గుంపులు గుంపులుగా వెళ్లి దాడులు చేశారు.
హరియాణ హోం మంత్రి అనిల్ విజ్ దీని గురించి మాట్లాడుతూ హింస వెనుక పెద్ద గేమ్ ప్లాన్ ఉందని ఆరోపించారు. ఇంటెలిజెన్స్ వైఫల్యంపై ప్రతిపక్షాల ఆరోపణలను అధికార పార్టీ తోసిపుచ్చింది. అయితే ఘర్షణల వెనుక సూత్రధారి ఎవరూ అనే విషయం కనుగొనలేదు అని పోలీసు నుహ్ సూపరింటెండెంట్ చెప్పారు. ఇప్పటి వరకు 106 ఎఫ్ఐఆర్లు నమోదు చేసిన పోలీసు అధికారులు 216 మందిని అరెస్టు చేశారు. సోషల్ మీడియా పోస్టులు పెట్టి అల్లర్లు వ్యాపించడానికి కారణం అయిన వారిపై ఇప్పటికే 24 ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని, హింసను ప్రేరేపించినందుకు నలుగురిని అరెస్టు చేశామని పోలీసు అధికారులు తెలిపారు.
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications