ప్రొఫెసర్ చెయ్యి పూర్తిగా నరికేసిన పీఎఫ్ఐ లీడర్స్, కోర్టులో ఖేల్ కథం, 13 ఏళ్ల తరువాత !
కొచ్చి/తిరువనంతపురం: కేరళలో 13 ఏళ్ల క్రితం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన ప్రొఫెసర్ చేతిని నరికిన కేసులో నిషేధిత పీఎఫ్ఐ సంస్థకు చెందిన ఆరుగురు కార్యకర్తలను స్థానిక ప్రత్యేక కోర్టు బుధవారం దోషులుగా నిర్ధారించింది. నిందితులకు శిక్షా పరిమాణాన్ని కోర్టు ప్రకటించనుంది. ఈ కేసును తొలుత విచారించిన కోర్టు 10 మందిని దోషులుగా ప్రకటించింది.
అయితే చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు సజిల్, నాసర్, నజీబ్లను దోషులుగా నిర్ధారించింది. ఈ చర్యలో అతనికి సహకరించిన నౌషాద్, పీపీ మొయిద్దీన్, అయూబ్లను దోషులుగా ప్రకటించింది. మిగిలిన నలుగురిని నిర్దోషులుగా విడుదల చేసింది. 2010లో జోసెఫ్ తాను బోధిస్తున్న కళాశాలలోని బీకాం విద్యార్థులకు ఇంటర్నల్ పరీక్ష నిర్వహించేందుకు ప్రశ్నాపత్రాన్ని సిద్ధం చేశాడు.

ఇందులో రచయిత పి.టి.కుంజు మహ్మద్ను బారీ మహమ్మద్గా అభివర్ణించారు. ఇది ఉద్దేశపూర్వక చర్య. ఇది ఇస్లాంను అవమానించడమేనని మతోన్మాదులు మండిపడ్డారు. అదే కారణంగా, 2010 జూన్ 4వ తేదీన న్యూమాన్ కాలేజీకి చెందిన ప్రొఫెసర్ టీజే జోసఫ్ తన కుటుంబంతో చర్చిలో ప్రార్థనలు చేసి తిరిగి కారులో ఇంటికి బయలుదేరాడు. జోసెఫ్ను కారులో నుంచి బయటకు లాగిన దుండగులు అతని కుడి చేయిని పూర్తిగా నరికేశారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడు సవాద్ ఇంకా పరారీలో ఉండడంతో పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసులో మొత్తం 54 మందిని నిందితులుగా ప్రకటించగా 37 మందిని చార్జిషీట్లో చేర్చారు. అనంతరం జరిగిన ఘటనపై టీజే జోసెఫ్ మాట్లాడుతూ నా చేయి నరికిన వారిపై నాకు ఎలాంటి పగ లేదు. కానీ ఈ సంఘటన వల్ల నా భార్యతో సహా మా కుటుంబం చాలా నష్టపోయింది
కానీ అది నా జీవితాన్ని పూర్తిగా నాశనం చేయలేదు. నాపై దాడి చేసిన వారు కేవలం ఆయుధాలు పట్టుకుని రెచ్చిపోయారని, వారి మూడనమ్మకాలతో బాధితులకు న్యాయం జరుగుతుందా అని ప్రశ్నించారు. ఏ యుద్ధంలోనైనా విజేతలు నాలాగే ఓడిపోయినవారే. అయినా నా పోరాటం ఆగదని టీజే జోసఫ్ అన్నారు. పీఎఫ్ కార్యకర్తలు మూడనమ్మకాలతో ఓ విద్యావంతుడి జీవితం నాశనం చేయడం అప్పట్లో కేరళతో పాటు దేశవ్యాప్తంగా కళకలం రేపింది.
-
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..!












Click it and Unblock the Notifications