Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భర్త చనిపోయిన మహిళను అర్దరాత్రి ఏం చేశారంటే, ఉద్యోగం నుంచి ఇంటికి వెళ్లి ?

బెంగళూరు/రాయచూరు: బాగా చదువుకున్న మహిళకు ఆమె కుటుంబ సభ్యులు వివాహం చేశారు. వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో కాపురం చేసింది. దంపతులకు పిల్లలు ఉన్నారు. పిల్లలను చూసుకుంటున్న మహిళ మంచి ఉద్యోగం చేస్తోంది. ఇదే సమయంలో భర్త చనిపోవడంతో ఆమె పిల్లలను పెంచిపోషిస్తున్నది. పిల్లలతో కలిసి నివాసం ఉంటున్న మహిళను అర్దరాత్రి హత్య చేసిన నిందితులు ఆమె శవాన్ని తగలబెట్టారు.

కర్ణాటకలోని రాయచూరు జిల్లాలోని లింగసనూరు తాలుకాలోని చిన్నద గని పట్టణం (బంగారు గని పట్టణం)లో మంజుల (45) అనే మహిళ నివాసం ఉంటున్నది. బాగా చదవుకున్న మంజులకు కుటుంబ సభ్యులు పెళ్లి చేశారు. భర్తతో కలిసి మంజుల చిన్నదగని పట్టణంలో నివాసం ఉంటున్నది. బంగారు గని కంపెనీలో మంజుల ల్యాబ్ టెక్నీషియన్ గా మంచి ఉద్యోగం చేస్తున్నది.

The killers killed a married woman and poured petrol on her body and set it on fire in Karnataka

మంజుల ఆమె భర్త, పిల్లలతో కలిసి చిన్నద గని కంపెనీ క్యాంపస్ లోని జీఆర్ కాలనీలోని ఇంటి నెంబర్ 45/6 ఇంటిలో నివాసం ఉంటున్నది. కొంతకాలం క్రితం మంజుల భర్త చనిపోయాడు, భర్త చనిపోయిన తరువాత మంజుల ఆమె పిల్లలతో కలిసి ఇంటిలో నివాసం ఉంటున్నది. పిల్లలను పెంచిపోషిస్తున్న మంజుల ఉద్యోగానికి వెళ్లి వస్తున్నది.

బుధవారం సాయంత్రం ఉద్యోగం ముగించుకున్న మంజుల ఇంటికి చేరుకుంది. రాత్రి పిల్లలతో కలిసి భోజనం చేసిన మంజుల తరువాత నిద్రపోయింది. గురువారం ఉదయం మంజుల ఆమె నివాసం ఉంటున్న ఇంటికి సుమారు వంద మీటర్ల దూరంలో శవమై కనిపించింది. మంజులను హత్య చేసిన నిందితులు ఆమె శరీరం మీద పెట్రోల్ పోసి నిప్పంటించి శవాన్ని కాల్చి బూడిద చెయ్యడానికి ప్రయత్నించారు.

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు. బుధవారం రాత్రి ఇంట్లో ఉన్న మంజుల ఎలా బయటకు వచ్చింది అని తెలియడం లేదు. గురువారం వేకువ జామున 2 గంటల నుంచి 3 గంటల మధ్యలో మంజులను హత్య చేసి శవాన్ని బయటకు తీసుకు వచ్చి కాల్చి బూడిద చెయ్యడానికి ప్రయత్నించి ఉంటారని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది.

The killers killed a married woman and poured petrol on her body and set it on fire in Karnataka

మంజుల హత్యకు కచ్చితమైన కారణాలు తెలియడం లేదని, అక్రమ సంబంధం కారణంగా, ఆర్థికలావాదేవీల కారణంగా ఏమైనా హత్య జరిగిందా ? అని ఆరా తీస్తున్నామని రాయచూరు జిల్లా పోలీసులు తెలిపారు. మంజుల నివాసం ఉంటున్న కంపెనీ క్యాంపస్ లోని క్వాటర్స్ సమీపంలోనే హత్య జరగడంతో ఆమెకు బాగా పరిచయం ఉన్న వాళ్లే పక్కాప్లాన్ తో హత్య చేసి ఉంటారని సాటి ఉద్యోగులు, స్థానికులు, పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+