భర్త చనిపోయిన మహిళను అర్దరాత్రి ఏం చేశారంటే, ఉద్యోగం నుంచి ఇంటికి వెళ్లి ?
బెంగళూరు/రాయచూరు: బాగా చదువుకున్న మహిళకు ఆమె కుటుంబ సభ్యులు వివాహం చేశారు. వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో కాపురం చేసింది. దంపతులకు పిల్లలు ఉన్నారు. పిల్లలను చూసుకుంటున్న మహిళ మంచి ఉద్యోగం చేస్తోంది. ఇదే సమయంలో భర్త చనిపోవడంతో ఆమె పిల్లలను పెంచిపోషిస్తున్నది. పిల్లలతో కలిసి నివాసం ఉంటున్న మహిళను అర్దరాత్రి హత్య చేసిన నిందితులు ఆమె శవాన్ని తగలబెట్టారు.
కర్ణాటకలోని రాయచూరు జిల్లాలోని లింగసనూరు తాలుకాలోని చిన్నద గని పట్టణం (బంగారు గని పట్టణం)లో మంజుల (45) అనే మహిళ నివాసం ఉంటున్నది. బాగా చదవుకున్న మంజులకు కుటుంబ సభ్యులు పెళ్లి చేశారు. భర్తతో కలిసి మంజుల చిన్నదగని పట్టణంలో నివాసం ఉంటున్నది. బంగారు గని కంపెనీలో మంజుల ల్యాబ్ టెక్నీషియన్ గా మంచి ఉద్యోగం చేస్తున్నది.

మంజుల ఆమె భర్త, పిల్లలతో కలిసి చిన్నద గని కంపెనీ క్యాంపస్ లోని జీఆర్ కాలనీలోని ఇంటి నెంబర్ 45/6 ఇంటిలో నివాసం ఉంటున్నది. కొంతకాలం క్రితం మంజుల భర్త చనిపోయాడు, భర్త చనిపోయిన తరువాత మంజుల ఆమె పిల్లలతో కలిసి ఇంటిలో నివాసం ఉంటున్నది. పిల్లలను పెంచిపోషిస్తున్న మంజుల ఉద్యోగానికి వెళ్లి వస్తున్నది.
బుధవారం సాయంత్రం ఉద్యోగం ముగించుకున్న మంజుల ఇంటికి చేరుకుంది. రాత్రి పిల్లలతో కలిసి భోజనం చేసిన మంజుల తరువాత నిద్రపోయింది. గురువారం ఉదయం మంజుల ఆమె నివాసం ఉంటున్న ఇంటికి సుమారు వంద మీటర్ల దూరంలో శవమై కనిపించింది. మంజులను హత్య చేసిన నిందితులు ఆమె శరీరం మీద పెట్రోల్ పోసి నిప్పంటించి శవాన్ని కాల్చి బూడిద చెయ్యడానికి ప్రయత్నించారు.
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు. బుధవారం రాత్రి ఇంట్లో ఉన్న మంజుల ఎలా బయటకు వచ్చింది అని తెలియడం లేదు. గురువారం వేకువ జామున 2 గంటల నుంచి 3 గంటల మధ్యలో మంజులను హత్య చేసి శవాన్ని బయటకు తీసుకు వచ్చి కాల్చి బూడిద చెయ్యడానికి ప్రయత్నించి ఉంటారని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది.

మంజుల హత్యకు కచ్చితమైన కారణాలు తెలియడం లేదని, అక్రమ సంబంధం కారణంగా, ఆర్థికలావాదేవీల కారణంగా ఏమైనా హత్య జరిగిందా ? అని ఆరా తీస్తున్నామని రాయచూరు జిల్లా పోలీసులు తెలిపారు. మంజుల నివాసం ఉంటున్న కంపెనీ క్యాంపస్ లోని క్వాటర్స్ సమీపంలోనే హత్య జరగడంతో ఆమెకు బాగా పరిచయం ఉన్న వాళ్లే పక్కాప్లాన్ తో హత్య చేసి ఉంటారని సాటి ఉద్యోగులు, స్థానికులు, పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications