రూ.కోటి లంచం, ఎస్ఐటి కస్టడీకి నిందితులు
బెంగళూరు: లోకాయుక్త రూ.కోటి లంచం డిమాండ్ చేసిన కేసులో అరెస్టు అయిన హైదరాబాద్ నివాసి అశ్విన్ రావ్, అతని అనుచరుడు భాస్కర్ ను ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు (ఎస్ఐటి) అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
కర్ణాటక లోకాయుక్త న్యాయమూర్తి భాస్కర్ రావ్ కుమారుడు అశ్విన్ రావ్, అతని అనుచరుడు భాస్కర్ ను లోకాయుక్త న్యాయస్థానం ముందు హాజరు పరిచారు. కేసు దర్యాప్తులో భాగంగా వీరిని విచారించడానికి కస్టడికి ఇవ్వాలని దర్యాప్తు చేస్తున్న అధికారులు కోర్టులో మనవి చేశారు.

కేసు వివరాలు తెలుసుకున్న లోకాయుక్త న్యాయస్థానం ఇద్దరిని ఎస్ఐటి అధికారుల కస్టడికి అప్పగించారు. ఈనెల 17వ తేది వరకు భాస్కర్ ను కస్టడిలోకి తీసుకుని విచారించడానికి లోకాయుక్త ప్రత్యేక న్యాయస్థానం అనుమతి ఇచ్చింది.
ఈ నెల 7వ తేదిన సాయంత్రంలోపు అశ్విన్ రావ్ ను కోర్టు ముందు హాజరుపరచాలని న్యాయమూర్తి సూచించారు. బెంగళూరు నగర జిల్లా గ్రామ పంచాయితీ లో సీనియర్ ఇంజనీరుగా పని చేస్తున్నకృష్ణమూర్తిని రూ. కోటి లంచం ఇవ్వాలని, అదే విధంగా హావేరికి చెందిన ఇంజనీరు చెన్నబసప్పను లంచం ఇవ్వాలని బెదిరించడంతో వీరిని అరెస్టు చేశారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications