వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దావూద్‌ను పట్టిస్తాం: ఇంటర్ పోల్ హామీ (ఫోటోలు)

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంను పట్టుకుని మీకు అప్పగిస్తామని ఇంటర్ పోల్ భారత ప్రధాని నరేంద్ర మోడీకి హామీ ఇచ్చింది. అంతే కాకుండా ప్రపంచ దేశాలలో దావూద్ ఇబ్రహీంకు చెందిన డీ గ్యాంగ్ ఆస్తుల పూర్తి వివరాలు సేకరిస్తామని స్పష్టం చేసింది.

న్యూఢిల్లీలో జరుగుతున్న ప్రత్యేక సమావేశానికి హాజరుకావడానికి ఇంటర్ పోల్ సెక్రటరీ జనరల్ జర్జెన్ స్టోక్ భారత్ చేరుకున్నారు. ఈ సందర్బంలో 50 దేశాలకు చెందిన ప్రతినిధులు న్యూఢిల్లీలోని ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఇంటర్ పోల్ సెక్రటరీ జనరల్ ప్రధాని నరేంద్ర మోడీతో ప్రత్యేక సమావేశం అయ్యారు.

దావూద్ ఇబ్రహీం కు చెందిన డీ గ్యాంగ్ కు దాదాపు 50 దేశాలలో ఆస్తులు ఉన్నాయని గుర్తించామని ఇంటర్ పోల్ గుర్తించింది. దావూద్ ఆస్తులతో పాటు వీలైంత త్వరగా అతనిని మీకు అప్పగిస్తామని ఇంటర్ పోల్ హామి ఇవ్వడంతో మోడీ సంతోషం వ్యక్తం చేశారు.

మోడీ, సింగ్ ప్రత్యేక సమావేశం

మోడీ, సింగ్ ప్రత్యేక సమావేశం

ఇంటర్ పోల్ సెక్రటరీ జనరల్ జర్జెన్ స్టోక్ తో ప్రధాని మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సుధీర్ఘంగా చర్చించారు.

ఇప్పుడు టార్గెట్ దావూద్

ఇప్పుడు టార్గెట్ దావూద్

మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంను ఎలాగైనా పట్టుకుని భారత్ తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది.

ఇంటర్ పోల్ పై నమ్మకం

ఇంటర్ పోల్ పై నమ్మకం

ప్రధాని మోడీ, రాజ్ నాథ్ సింగ్ ఇంటర్ పోల్ మీద నమ్మకం పెట్టుకున్నారు. దావూద్ ను అరెస్టు చేసి భారత్ కు అప్పగించాలని ఇంటర్ పోల్ కు మనవి చేశారు.

ఛోటా రాజన్ లాగే

ఛోటా రాజన్ లాగే

ఛోటా రాజన్ ను ఎలాగైతే ఇంటర్ పోల్ సహాయంతో అరెస్టు చేశారో అదే విధంగా దావూద్ ను పట్టుకోవాలని నిర్ణయించారు.

చివరి సారి దుబాయ్

చివరి సారి దుబాయ్

దావూద్ ఇబ్రహీం చివరి సారి ఇక్కడి నుంచి దుబాయ్ వెళ్లాడని భారత్ అంటున్నది.

పాకిస్థాన్ లోనే ఉన్నాడు

పాకిస్థాన్ లోనే ఉన్నాడు

దావూద్ ఇబ్రహీం ప్రస్తుతం పాకిస్థాన్ లోని కరాచిలో తలదాచుకున్నాడని భారత్ దగ్గర పక్కా సమాచారం ఉంది.

ఇంటర్ పోల్ కు సమాచారం

ఇంటర్ పోల్ కు సమాచారం

భారత్ దగ్గర ఉన్న దావూద్ ఇబ్రహీం పూర్తి సమాచారాన్ని ఇంటర్ పోల్ అధికారులకు అప్పగించారు.

దావూద్ తో పాటు ఛోటా షకీల్

దావూద్ తో పాటు ఛోటా షకీల్

దావూద్ ఇబ్రహీంతో పాటు అతని కుడిభుజం ఛోటా షకీల్ ను పట్టుకోవాలని భారత్ ప్రభుత్వం భావిస్తున్నది.

2016లోపు

2016లోపు

2016 ప్రథమార్థంలోనే దావూద్ ను పట్టుకుని భారత్ తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది.

English summary
The meeting between Prime Minister Narendra Modi and Interpol Secretary General Jurgen Stock at New Delhi was a fruitful one with the latter promising that Dawood Ibrahim would be nabbed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X