Cheetah: ఏడు దశాబ్దాల తర్వాత అద్భుతం, కునోలో మరో చిరుత ప్రసవం
భారత అడవుల నుంచి ఏడు దశాబ్దాల క్రితం కనుమరుగైపోయిన 'వేగం'.. ఇప్పుడు మళ్ళీ తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తోంది. ఒకప్పుడు మౌనంగా ఉండిపోయిన కునో నేషనల్ పార్క్ లోయలు, ఇప్పుడు పసి కూనల గర్జనలతో ప్రతిధ్వనిస్తున్నాయి.
దశాబ్దాల విరామం తర్వాత, భారత గడ్డపై పుట్టిన చిరుతల సంఖ్య పెరుగుతుంటే, అది కేవలం వన్యప్రాణి సంరక్షణ మాత్రమే కాదు.. ప్రకృతిపై భారత్ సాధించిన అద్భుత విజయం! బుధవారం దక్షిణాఫ్రికా వీరవనిత 'గామిని' ముగ్గురు పసి కూనలకు జన్మనివ్వడంతో, భారతదేశపు చీతా సైన్యం 38కి చేరుకుని కొత్త రికార్డును సృష్టించింది.

ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన జంతువు చీతా.. మన దేశంలో 1952లో అంతరించిపోయిందని ప్రకటించినప్పుడు, భారత ప్రకృతి వైవిధ్యంలో ఒక పెద్ద వెలితి ఏర్పడింది. కానీ, 2022లో 'ప్రాజెక్ట్ చీతా' రూపంలో ఆ వెలితిని పూడ్చేందుకు భారత్ నడుం బిగించింది. ఆ నమ్మకానికి నిదర్శనంగా నేడు కునో గడ్డపై 27 కూనలు మన మట్టిలోనే పుట్టి పెరగడం దేశానికే గర్వకారణం.
Cheetah గామిని ప్రసవం..
దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన 'గామిని' రెండోసారి తల్లిగా మారి, మూడు నూతన వారసులను ఈ ప్రపంచానికి పరిచయం చేయడం.. ఈ ప్రాజెక్ట్ ఎంతటి పటిష్టమైన పునాదులపై ఉందో చాటి చెబుతోంది.
కునోలో 'మినీ' చిరుతల సందడి!
కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఈ అద్భుత ఘట్టాన్ని "గర్జిస్తున్న విజయం" (Roaring Success) గా అభివర్ణించారు. కేవలం మూడు ఏళ్ల కాలంలో 9 సార్లు చిరుతలు విజయవంతంగా సంతానోత్పత్తి చేయడం అంటే అది మన పశువైద్యులు, ఫీల్డ్ స్టాఫ్ యొక్క నిరంతర శ్రమకు దక్కిన ఫలితం. ఈ నెలారంభంలోనే 'ఆశ' అనే చీతా ఐదుగురు చిన్నారులను తీసుకురాగా, ఇప్పుడు 'గామిని' ఆ సంఖ్యను మరింత పెంచింది.
Another good news from Kuno🐆🌿
— Bhupender Yadav (@byadavbjp) February 18, 2026
Kuno welcomes three new cubs - A roaring new chapter at Kuno on the occasion of completion of 3 years of arrival of cheetahs from South Africa.
Celebrations echo through Kuno National Park as Gamini, the South African cheetah and second-time… pic.twitter.com/JpqnfXlpYl
వేగానికి సరికొత్త చిరునామా.. భారత్!
ఈ పసి కూనలు కేవలం జంతువులు మాత్రమే కాదు, భారతదేశం తన పర్యావరణ వారసత్వాన్ని ఎంతలా ప్రేమిస్తుందో చెప్పడానికి సజీవ సాక్ష్యాలు. "గామిని మరియు ఆమె మూడు చిన్న రన్నర్లు వేగంతో, గ్రేస్తో మన దేశపు చీతా పునరుజ్జీవన కథను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్తాయని ఆశిస్తున్నాను" అని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఉద్వేగంగా ప్రకటించారు. అవును.. భారత్ గడ్డపై వేగం మళ్ళీ పరుగు మొదలుపెట్టింది!
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications