Lady: రెండో భర్తతో కాపురం, మొదటి భర్త కూతుర్లను రెండో భర్త ఏం చేశాడంటే ?, మ్యాటర్ లీక్, ఫినిష్ !
చెన్నై/తిరుచ్చి: వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో చక్కగా కాపురం చేసింది. దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం భర్త చనిపోయాడు. భర్త చనిపోయిన తరువాత భార్య ఆమె కుమార్తెలతో కలిసి జీవిస్తోంది. కూతుర్లను పోషించడానికి ఆమె పనికి వెళ్లి వస్తున్న సమయంలో ఓ యువకుడు ఆమెకు పరిచయం అయ్యాడు. రానురాను ఇద్దరూ అక్రమ సంబంధం పెట్టుకున్నారు. కొంతకాలానికి వయసులో చిన్నవాడైన యువకుడిని ఆమె రెండో పెళ్లి చేసుకుంది. తల్లితో కాపురం చేస్తున్న కామాంధుడు ఆమె మొదటి భర్త కుమార్తెల మీద కన్ను వేశాడు. తన రెండో భర్త తన కూతుర్తెలతో సరసాలు ఆడుతున్నాడని తెలుసుకున్న మహిళ రగిలిపోయింది.

భర్త చనిపోయాడు
తమిళనాడులోని కడలూరు జిల్లా పన్రుటికి చెందిన రేఖా అనే మహిళకు 16 ఏళ్ల క్రితం వివాహం అయ్యింది. వివాహం చేసుకున్న రేఖా ఆమె భర్తతో చక్కగా కాపురం చేసింది. రేఖా దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 10 సంవత్సరాల క్రితం రేఖా భర్త చనిపోయాడు. భర్త చనిపోయిన తరువాత రేఖా ఆమె కుమార్తెలతో కలిసి జీవిస్తోంది.

ఇటుకల ఫ్యాక్టరీలో కూలీ పనులు
కూతుర్లను పోషించడానికి రేఖా తిరుచ్చి జిల్లాలోని ముసిరి ప్రాంతానికి వెళ్లింది. తరువాత రేఖా ఓ ఇటుకల ఫ్యాక్టరీలో కూలీగా పనిలో చేరింది. అదే ప్రాంతంలో రేఖఆ అద్దె ఇంటిని తీసుకుని నివాసం ఉంటున్నది. ఆ సమయంలో అదే ఇటుకల ఫ్యాక్టరీలో పని చేస్తున్న ప్రభు అనే యువకుడు రేఖాకు పరిచయం అయ్యాడు. ఒకేచోట పని చేస్తున్న రేఖా, ప్రభు ప్రతిరోజు మాట్లాడుకుంటున్నారు.

అక్రమ సంబంధం.... ప్రియుడితో ఎంజాయ్
రానురాను రేఖా, ప్రభు ఇద్దరూ అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేశారు. రేఖా కూతుర్లు వయసుకు వచ్చారు. ప్రభు కూడా రేఖా ఇంటికి వచ్చి వెళ్లడం మొదలుపెట్టారు. కొంతకాలానికి వయసులో చిన్నవాడైన ప్రభును రెండో పెళ్లి చేసుకోవాలని రేఖా అనుకుంది. రేఖాను పెళ్లి చేసుకోవడాని ప్రభు అంగీకరించడంతో తరువాత పెళ్లి చేసుకున్నారు.

కూతుర్లతో సరసాలు
రేఖా ఇంటిలోనే ఆమె రెండో భర్త ప్రభు కూడా ఉండిపోయాడు. రేఖా ఇంట్లో లేని సమయంలో ఆమె మొదటి భర్త కుమార్తెలను ప్రభు లైంగిక వేధింపులకు గురి చేశాడు. విసయం బయటకు చెబితే మిమ్మల్ని మీ అమ్మ రేఖాను చంపేస్తానని ప్రభు ఇద్దరు అమ్మాయిలను బెదిరించాడు. అమ్మాయిలు భయంతో తల్లి రేఖాకు చాలాకాలం మ్యాటర్ చెప్పలేదు. కొన్ని నెలల క్రితం తన కూతుర్లతో తన రెండో భర్త ప్రభు సరసాలు ఆడుతున్నాడని తెలుసుకున్న రేఖా రగిలిపోయింది.

రెండో భర్తను చంపేసి నదిలో శవం విసిరేసింది
గత ఏడాది సెప్టెంబర్ నెలలో పని ఉందని ప్రభుకు చెప్పిన రేఖా అతన్ని అయ్యాంపాళ్యం గ్రామం సమీపంలోని కావేరి నది ఒడ్డుకు పిలుచుకుని వెళ్లింది. తరువాత తన కూతుర్లతో నువ్వు సరాలు ఆడుతావా అంటూ గొడవ పెట్టుకుంది. ముందుగా బ్యాగ్ లో తీసుకెళ్లిన కొడవలి బయటకు తీసిన రేఖా ఆమె రెండో భర్త ప్రభు మీద ఇష్టం వచ్చినట్లు దాడి చెయ్యడంతో అతని ప్రాణం పోయింది. శవాన్ని కావేరి నదిలో విసిరేసిన రేఖా తరువాత సైలెంట్ గా అక్కడి నుంచి వచ్చేసింది.

నాలుగు నెలల తరువాత చిక్కిపోయిన రేఖా
కొన్ని రోజులకు నదిలో కుళ్లిపోయిన వ్యక్తి మృతదేహం ఒడ్డుకు కొట్టుకొచ్చింది. అదే సెప్టెంబర్ నెలలో పోలీసులు గుర్తు తెలియని శవం అని కేసు నమోదు చేశారు. తన కుమారుడు కొన్ని నెలల నుంచి కనపడటం లేదని ప్రభు తండ్రి పోలీసు కేసు పెట్టాడు. కేసు నమోదు చేసిన పోలీసులు కుళ్లిపోయిన శవం ప్రభుది అని గుర్తించారు. ప్రభును హత్య చేసిన వారం రోజుల తరువాత రేఖా ఆమె పిల్లలతో కలిసి ఆ ప్రాంతం వదిలిపారిపోయింది. చాలా కాలం నుంచి రేఖా కోసం గాలిస్తున్న పోలీసులకు ఆమె చిక్కిపోయింది. ప్రభును తానే హత్య చేశానని రేఖా అంగీకరించిందని, కేసు విచారణలో ఉందని పోలీసు అధికారులు తెలిపారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications