SPG గురించి ప్రపంచానికి తెలియని రహస్యాలు.
దేశాధినేత రక్షణ అంటే అది కేవలం ఒక విధి కాదు.. అదొక తపస్సు. 1984లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ స్వంత అంగరక్షకుల చేతిలోనే హత్యకు గురైన తర్వాత, భారత భద్రతా వ్యవస్థలో సమూల మార్పుల అవసరం ఏర్పడింది. ప్రధానమంత్రికి అత్యున్నత స్థాయి భద్రత కల్పించేందుకు ఒక ప్రత్యేక దళం ఉండాలని భావించిన ప్రభుత్వం, బీర్బల్నాథ్ కమిటీ సూచనల మేరకు.. 1985, మార్చి 30న రాష్ట్రపతి కార్యనిర్వాహక ఉత్వర్వుల ద్వారా కేబినెట్ సెక్రటేరియట్లో దీని కోసం 819 పోస్టులు సృష్టించారు. 1985 ఏప్రిల్ 8న 'స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్' (SPG)ను ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ప్రతి ఏటా ఈ రోజును 'ఎస్పీజీ రైజింగ్ డే' గా నిర్వహిస్తున్నారు.
SPG లోకి వెళ్లడం అంటే మామూలు విషయం కాదు. ఇందులో నేరుగా రిక్రూట్మెంట్ ఉండదు. దేశంలోని వివిధ పారామిలిటరీ దళాలైన BSF, CISF, ITBP, CRPFల నుంచి అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని ఎంపిక చేస్తారు. వారు దాదాపు మూడు నెలల పాటు కఠినమైన శిక్షణను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ శిక్షణ ఎంత కఠినంగా ఉంటుందంటే, ఎంపికైన వారిలో 20 శాతం మంది కూడా చివరి వరకు నిలవలేరు. అమెరికాలోని 'సీక్రెట్ సర్వీస్' ఏజెంట్లకు ఇచ్చే శిక్షణ తరహాలోనే వీరికి కూడా శిక్షణ ఉంటుంది.

నల్ల కళ్లద్దాల వెనుక రహస్యం ఏమిటి?
ప్రధాని పక్కన ఉండే ఎస్పీజీ కమెండోలు ఎప్పుడూ నల్లటి కళ్లద్దాలు ధరించి ఉంటారు. దీని వెనుక ఒక వ్యూహం ఉంది. వారు ఎవరిని గమనిస్తున్నారు, ఎటువైపు చూస్తున్నారో శత్రువులకు తెలియకూడదు. అలాగే పేలుళ్లు సంభవించినప్పుడు వచ్చే కాంతికి కళ్లు చెదరకుండా ఉండేందుకు ఇవి రక్షణనిస్తాయి. వీరు ధరించే నలుపు రంగు సూట్లు బుల్లెట్ ప్రూఫ్గా పనిచేస్తాయి. వీరు వాడే FN F2000 అసాల్ట్ రైఫిల్స్, గ్లాక్ పిస్టల్స్ సెకనుకు పదుల సంఖ్యలో బుల్లెట్లను కురిపించగలవు.
SPG బడ్జెట్.. అక్షరాలా కోట్లలో!
ఎస్పీజీకి కేటాయించే బడ్జెట్ వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ప్రస్తుతం కేవలం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మాత్రమే ఈ భద్రత కల్పిస్తున్నారు. 2024-25 బడ్జెట్ అంచనాల ప్రకారం, ఎస్పీజీ కోసం ప్రభుత్వం దాదాపు రూ. 400 కోట్లకు పైగా కేటాయించింది. అంటే ఒక్కో రోజుకు కోటి రూపాయలకు పైగానే ఖర్చు అవుతుంది. ఈ దళంలోని ప్రతీ కమెండో ప్రధాని కోసం తన ప్రాణాలను త్యాగం చేసేలా మానసికంగా సిద్ధమై ఉంటారు.
చట్టబద్ధమైన హోదా - మార్పులు...
1985లో ఏర్పడినప్పటికీ, 1988లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకువచ్చే వరకు దీనికి చట్టబద్ధత లేదు. మొదట్లో ప్రధాని కుటుంబ సభ్యులందరికీ ఈ భద్రత ఉండేది. అయితే, భద్రతా కారణాలు, పెరిగిన ఖర్చుల దృష్ట్యా 2019లో చట్టాన్ని సవరించారు. దీని ప్రకారం ప్రస్తుతం కేవలం అధికారంలో ఉన్న ప్రధానమంత్రికి, వారి అధికారిక నివాసంలో ఉండే కుటుంబ సభ్యులకు మాత్రమే ఈ భద్రత వర్తిస్తుంది.
దేశం ఎక్కడ ఉన్నా, ప్రధాని ఎక్కడ పర్యటించినా.. వారి రక్షణ కోసం గాలిలో, నేలపైన, నీటిలోనూ ఎస్పీజీ కమెండోలు నిరంతరం అప్రమత్తంగా ఉంటారు. 'జీరో ఎర్రర్' పాలసీతో పనిచేసే ఈ దళం, భారత భద్రతా వ్యవస్థకే గర్వకారణం.
-
Lockdown: ఇవాళ రాత్రి నుంచే కర్ఫ్యూ, ప్రభుత్వం సంచలన నిర్ణయం! -
ప్రపంచంలోనే అత్యధిక సైన్యం కలిగిన దేశాలు ఇవే.. మారిన లెక్కలు.. -
ఒక్క పోస్టుతో అందరికీ ఇచ్చిపడేసిన "త్రిష".. -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!! -
ఏమిటీ వింత? తెల్ల పులికి పుట్టిన పసుపు పిల్లలు.. -
నైరుతి రుతుపవనాలు షాక్. ఈ 4 నెలలు వర్షాలు కరువే? -
మందు బాబుల పై ధరల బాంబు- మద్యం రేట్లు భారీగా పెంపు, వీటికి మినహాయింపు..!! -
LKG, UKG ఇక సర్కారు బడిలోనే.. 6 వేల కొత్త ఉద్యోగాల! -
సమ్మర్ స్పెషల్ 'బాదంపాలు'.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి..! -
తెలుగులో నిర్మాతలను పూర్తిగా ముంచేసిన టాప్-5 డిజాస్టర్లు -
ఆ ఉద్యోగులను రెండు నెలల్లో పర్మినెంట్ చెయ్యండి.. హైకోర్టు కీలక ఆదేశాలు! -
ఆ గోర్లేంటీ.. ఆ చెయ్యేంటీ: అల్లు అర్జున్- అట్లీ బాక్సాఫీస్ కింగ్ కాంగ్: ఈ దెబ్బకు














Click it and Unblock the Notifications