ఆమెకు ఎక్కువ ఆస్తి ఇచ్చి తనకు తక్కువ ఆస్తి ఇచ్చాడని తండ్రిని చంపిన కొడుకు, తల్లిని వదల్లేదు
ఆస్తిలో కూతురుకు పెద్దపీట వేసి ఎక్కువ ఆస్తి ఇచ్చాడనే కోపంతో కొడుకు అతని కన్న తండ్రిని రాళ్లతో కొట్టి చంపిన ఘటన కర్ణాటకలో కలకలం రేపింది. మండ్య తాలూకా సుందహళ్లిలో కొడుకు చేతిలో తండ్రి హత్యకు గురైనాడని కర్ణాటక పోలీసులు అన్నారు. దీన్ని అడ్డుకునేందుకు వచ్చిన తల్లిపై దారుణంగా దాడి చెయ్యడంతో ఆమెను బెంగళూరులోని నిమ్హాన్స్ ఆస్పత్రిలో చేర్పించారు.
సుందహళ్ళి గ్రామానికి చెందిన నంజప్ప (65) హత్యకు గురైనాడని పోలీసులు అన్నారు. నంజప్పను అతని కుమారుడు మహదేవ్ (40) హత్య చేశాడని, హత్య చేసిన తరువాత నిందితుడు తప్పించుకుని పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. బెంగళూరు శివార్లలోనిరామనగర జిల్లా, అర్చకరహళ్లి గ్రామానికి చెందిన నంజప్ప తర్వాత తన కుమార్తె, అల్లుడు నివాసం ఉంటున్న మండ్య తాలూకాలోని సుందహళ్లి గ్రామానికి వచ్చి అక్కడే స్థిరపడ్డాడు.

నంజప్పకు సొంత ఇల్లు, భూమి ఉంది. ఈలోగా అర్చకరహళ్లిలోని 2 ఎకరాల భూమిని విక్రయించి వచ్చిన డబ్బును నంజప్ప అతని కూతురు, కొడుకులకు పంచాడు. అంతేకాకుండా నంజప్ప అతని ఇంటి సమీపంలోని భూమిని తన కుమార్తె పేరున రాసేశాడు. సుందహళ్లి సమీపంలోని భూమిని అమ్ముతామని నంజప్ప చెప్పడంతో అతని కూతురు గొడవకు దిగాడు. తర్వాత నంజప్ప అతని కూతురికి కొంత ఆర్థిక సాయం చేశాడు. దీంతో కోపోద్రిక్తుడైన కుమారుడు మహదేవ ఈ విషయమై తరచూ తండ్రి నంజప్పతో గొడవ పడేవాడు.
ఇంతలో తన కూతురికి అర ఎకరం భూమి అమ్మగా వచ్చిన డబ్బును నంజప్ప ఇచ్చాడు. దీంతో కోపోద్రిక్తుడైన కుమారుడు మహదేవ మంగళవారం ఉదయం తండ్రి నంజప్పతో గొడవ పడుతున్నాడు. కొడుకు మహదేవ నుంచి తప్పించుకునేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చిన నంజప్పను అతని కొడుకు పట్టుకున్నాడు. తరువాత తండ్రి నంజప్పను ఊరంతా తిప్పితిప్పి కొట్టి ఆయన మీద తీవ్రస్థాయిలో దాడికి పాల్పడ్డారు.
అడ్డుకునేందుకు వచ్చిన తల్లి మహదేవమ్మపై బండ రాయితో దాడి చేశాడు. దీంతో తండ్రి నంజప్ప ముఖాన్ని రాయితో చితకబాది హత్య చేశాడు.
ఈ ఘటనలో గాయపడిన మహదేవమ్మ పరిస్థితి విషమంగా ఉండడంతో బెంగళూరులోని నిమ్హాన్స్ ఆస్పత్రిలో చేర్పించారు. తండ్రి నంజప్పను హత్య చేసిన మహదేవ తప్పించుకున్నాడని పోలీసులు తెలిపారు. మండ్య రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.












Click it and Unblock the Notifications