చదివేది ఎల్ఎల్ బి, బీసీఏ,పేలుడు పదార్థాలు ఎక్కడ కొన్నారంటే?, స్టూడెంట్స్ టార్గెట్!
భారతదేశంలో పుట్టిపెరుగుతు ఇక్కడే జీవిస్తున్న కొందరు యువకులు ఇదే దేశాన్ని నాశనం చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారని, ఇంతకాలం మన మధ్యనే వాళ్లు ఉన్నారని తెలుసుకుంటున్న సామాన్య ప్రజలు హడలిపోతున్నారు. భారతదేశంలోనే నివాసం ఉంటున్న అనుమానిత ఉగ్రవాదులు, నిషేధిత సంస్థలు, ఉగ్రవాదులతో లింక్ పెట్టుకున్న వాళ్లను ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేస్తున్నా ఇలాంటి వారి సంఖ్య తగ్గడం లేదు.
డిసెంబరు 18వ తేదీన కర్ణాటకలోని బళ్లారి నగరంలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దాడులు నిర్వహించి అరెస్టు చేసిన ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులు బళ్లారిలోనే పేలుడు పదార్థాల తయారీకి అమ్మోనియం నైట్రేట్ను కొనుగోలు చేసినట్లు కలకలం రేపే సమాచారం బయటకు రావడంతో బళ్లారి ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఎన్ఐఏ అధికారుల విచారణలో అరెస్టు అయిన ప్రధాన నిందితులు ఈ విషయం అంగీకరించారని తెలిసింది.

బళ్లారి అలో అరెస్టు అయిన ప్రధాన నిందితులు మినాజ్ అలియాస్ మహ్మద్ సులేమాన్, సయ్యద్ సమీర్లు పేలుడు పదార్థాల తయారీ కోసం అక్టోబర్ 22న నగరంలోని ఓ ఎరువుల దుకాణం నుంచి కిలో అమ్మోనియం నైట్రేట్ను కొనుగోలు చేసినట్లు అధికారుల విచారణలో తెలిసింది. అయితే అరెస్టు అయిన నిందితులు అమ్మోనియం నైట్రేట్ను బళ్లారిలోని ఏ దుకాణం నుంచి కొనుగోలు చేశారనే దానిపై స్పష్టమైన క్లూ ఇవ్వలేదని అధికారులు అంటున్నారు.
అమ్మోనియం నైట్రేట్ కొనుగోలు చేసిన రసీదు నిందితుల దగ్గర చిక్కలేదని, అమ్మోనియం నైట్రేట్ పొలం పంటలకు ఉపయోగించే యూరియా మాదిరిగానే ఉంటుందని, దాని అమ్మకంపై ఎటువంటి పరిమితులు, నియమాలు ఉండవు అని తెలిసింది. పేలుడు పదార్థాల తయారీకి కూడా ఈ పదార్థమే ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు.
డిసెంబర్ 18వ తేదీన కర్ణాటక సహా దేశంలోని 19 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేసిన జాతీయ దర్యాప్తు విభాగం అధికారులు బళ్లారిలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.ఐఎస్ఐఎస్ స్ఫూర్తితో బళ్లారిని కేంద్రంగా (బళ్లారి మాడ్యూల్) ఎంచుకున్న ఉగ్రవాదులు దేశంలోని పలు ప్రాంతాల్లో విధ్వంసక చర్యలకు సిద్ధమైనట్లు విచారణలో వెల్లడైంది.
అరెస్టు అయిన వారిలో ఒకరు న్యాయ విద్యార్థి (ఎల్ఎల్ బి) కాగా, మరొకరు బీసీఏ విద్యార్థి అని అధికారుల విచారణలో వెలుగు చూసింది. వీరిద్దరూ కర్ణాటక రాష్ట్రంలోని వివిధ కళాశాలలు, యూనివర్సిటీల విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని నిషేధిత ఐసిస్ సంస్థ వైపు విద్యార్థులను ఆకర్షిస్తున్నట్లు సమాచారం. కేసు దర్యాప్తు విచారణలో ఉంది.
-
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..!












Click it and Unblock the Notifications