Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Bangaluru Thief: ప్రముఖ సినీ నటితో దొంగ ప్రేమాయణం.. రూ.3 కోట్ల ఇల్లు కట్టించేశాడు.. చివరకు!

Bangalore: ప్రేమలో మునిగిన వారు ప్రియురాలి కోసం తమ ప్రాణాలను ఇవ్వడానికి కూడా వెనకాడరు. తమ సర్వస్వాన్ని ధారపోస్తారు. ప్రేమ.. పదం ఒక్కటే అయినా, అది ప్రతిఒక్కరి జీవితంలో ఓ అందమైన మధుర స్మృతి. ముఖ్యంగా అబ్బాయిలకు దీని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రేమించిన అమ్మాయి కోసం ఏం చేసేందుకైనా సిద్ధమైపోతారు, ఎక్కడిదాకా అయినా వెళ్తారు, అవసరమైతే తమ జీవితాన్నే రిస్క్ లో పెట్టడానికైనా వెనకాడరు. అలాగే ఓ దొంగ తన ప్రియురాలి కోసం ఏం చేశాడో తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు. తాను దోచుకున్న సొమ్ముతో రూ.3 కోట్ల ఇంటిని కట్టించేశాడు. ఆ వ్యక్తి తన ప్రియురాలికి రూ.22 లక్షల విలువైన అక్వేరియంను కూడా బహుమతిగా ఇచ్చాడట. ఆ దొంగను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని 37 ఏళ్ల పంచాక్షరి స్వామిగా గుర్తించారు. ఆ ప్రియురాలు ఓ ప్రముఖ సినీ నటి అని.. ఆమెతో అతనికి సంబంధాలు ఉన్నాయని కూడా పోలీసులు వెల్లడించారు.

అతడి అరెస్ట్ తో చాలా కాలంగా కొనసాగుతున్న నేర కార్యకలాపాలకు బెంగళూరులోని మడివాలా పోలీసులు ముగింపు పలికారు. నిందితుడు పంచాక్షరి స్వామి మహారాష్ట్రలోని సోలాపూర్ కు చెందినవాడు. వివాహం చేసుకుని ఓ బిడ్డ ఉన్నప్పటికీ.. అతను తన ప్రియురాలితో ప్రేమాయణం నడుపుతున్నాడు. పంచాక్షరి స్వామి 2003లో మైనర్‌గా ఉన్నప్పుడే దొంగతనాలు చేయడం ప్రారంభించాడని దర్యాప్తులో తేలింది. 2009 నాటికి అతను వృత్తిపరమైన దొంగగా మారాడు. తన నేరాల ద్వారా కోట్ల విలువైన సంపదను కూడబెట్టాడు. 2014-15లో అతను ఒక ప్రముఖ నటితో పరిచయం ఏర్పరచుకుని ఆమెతో ప్రేమ సంబంధాన్ని పెంచుకున్నాడు. విచారణలో నిందితుడు ఆ నటి కోసం కోట్లు ఖర్చు చేశానని ఒప్పుకున్నాడు. కోల్‌కతాలో రూ.3 కోట్ల విలువైన ఇల్లు నిర్మించి, ఆమెకు రూ.22 లక్షల విలువైన అక్వేరియంను బహుమతిగా ఇచ్చాడు.

Thief Builds 3 Crore House for Girlfriend Arrested in Bengaluru

2016లో స్వామిని గుజరాత్ పోలీసులు అరెస్టు చేసి ఆరు సంవత్సరాల జైలు శిక్ష విధించారు. అహ్మదాబాద్‌లోని సబర్మతి సెంట్రల్ జైలు నుంచి విడుదలైన తర్వాత అతను తిరిగి దొంగతనాలకు దిగాడు. అనంతరం మహారాష్ట్ర పోలీసులు ఇలాంటి నేరాలకు పాల్పడుతున్ అతడిని అరెస్ట్ చేశారు. 2024లో విడుదలైన తర్వాత అతను తన స్థావరాన్ని బెంగళూరుకు మార్చాడు. అక్కడ తిరిగి ఇళ్లలో దొంగతనాలను ప్రారంభించాడు. జనవరి 9న, బెంగళూరులోని మడివాలా ప్రాంతంలోని ఒక ఇంట్లో దొంగతనం చేశాడు. నిఘా సమాచారం మేరకు పోలీసులు మడివాలా మార్కెట్ ప్రాంతంలో అతన్ని అరెస్టు చేశారు. విచారణలో అతను తన సహచరుడితో కలిసి బెంగళూరులో నేరాలు చేసినట్లు అంగీకరించాడు.

దొంగిలించబడిన బంగారాన్ని కరిగించి బంగారు బిస్కెట్లుగా మార్చడానికి ఉపయోగించే ఇనుప రాడ్, ఫైర్ గన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొంగిలించబడిన ఆభరణాలతో తయారు చేసిన బంగారం,వెండి బిస్కెట్లన్నింటినీ మహారాష్ట్రలోని సోలాపూర్‌లోని తన నివాసంలో నిల్వ చేసినట్లు స్వామి వెల్లడించాడు. దీంతో అధికారులు 181 గ్రాముల బంగారు బిస్కెట్లు, 333 గ్రాముల వెండి వస్తువులు,ఆభరణాలను కరిగించడానికి ఉపయోగించే ఫైర్ గన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నేరాలు చేసిన తర్వాత అనుమానం రాకుండా ఉండటానికి స్వామి రోడ్డుపై బట్టలు మార్చుకునేవాడని కూడా దర్యాప్తు అధికారులు కనుగొన్నారు. అతను కరాటేలో బ్లాక్ బెల్ట్ కలిగి ఉన్నాడు. అతని తండ్రి మరణం తరువాత తల్లికి రైల్వే శాఖలో ఉద్యోగం లభించింది. దర్యాప్తులో స్వామికి ఒక ఇల్లు ఉందని, అది అతని తల్లి పేరు మీద ఉందని తేలింది. అయితే రుణాలు చెల్లించకపోవడంతో ఒక బ్యాంకు వేలం నోటీసు జారీ చేసిందని పోలీసు వర్గాలు తెలిపాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+