తుపాకీతో గజదొంగ బ్యాంకుకు వచ్చాడు...బ్యాంకులో ఏం జరిగింది
పేరుమోసిన గజదొంగ. అయితే పెద్ద నగదు నోట్ల రద్దుతో ఆయనకు ఇబ్బందులు తప్పలేదు. ఉత్తర ప్రదేశ్, మద్యప్రదేశ్, బుందేల్ ఖండ్ ప్రాంతాలను గడడడలాడించిన మల్ఖాసింగ్ నగదు మార్పిడి కోసం బ్యాంకు వద్ద క్యూ లైన్ లో నిల
గ్వాలియర్ :పేరుమోసిన గజదొంగ. చేతిలో తుపాకి, మరో చేతిలో కరెన్సీ బ్యాగు. మెడకు సెల్ ఫోన్ తో దర్జాగా బ్యాంకు కు వచ్చాడు.ఆయనను చూసి బ్యాంకుకు నగదు మార్పిడి కోసం వచ్చిన జనం భయాందోళనకు గురయ్యారు.పెద్ద నగదు నోట్ల రద్దు తో నగదు మార్పిడి కోసం ఆయన కూడ బ్యాంకు వద్ద క్యూలో నిలబడ్డారు.
మల్ఖన్ సింగ్ ఈ పేరు ఉత్తర భారత ప్రజలకు సుపరిచితమే. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, మద్యప్రదేశ్, బుందేల్ ఖండ్ ప్రాంతాల్లో ఈ పేరు తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు.197080 దశకంలో ఈ ప్రాంతాల్లో ఆయన అనేక దోపిడిలకు పాల్పడ్డారు.
మల్ఖన్ సింగ్ తో పాటు ఆయన ముఠా సబ్యులపై 94 కేసులున్నాయి..వీటిలో 18 దోపిడి, 28 కిడ్నాప్, 19 హాత్యయత్నం, 17 హత్యకేసులున్నాయి. చంబల్ పరిసర ప్రాంతాల్లో ఈయన పేరు చెబితే ప్రజలు భయంతో వనికిపోతారు. 1983 లో తన ముఠా సభ్యులతో కలిసి ఆయన అప్పటి ముఖ్యమంత్రి అర్జున్ సింగ్ ఎదుట లొంగిపోయారు.

1976 లో మల్ఖన్ సింగ్ కు అప్పటి బిలావ్ సర్పంచ్ కైలాష్ నారాయణకు మద్య పెద్ద గొడవ జరిగింది. ఈ గొడవలో కైలాస్ నారాయణ ఇద్దరు గన్ మెన్లు చనిపోయారు.కైలాష్ నారాయణ్ కూడ గాయపడ్డారు.ఈ ఘటన జరిగిన తర్వా మల్ఖాన్ సింగ్ ఉత్తర్ ప్రదేశ్ కు పారిపోయాడు.ఇంతటి నేర చరిత్ర ఉన్న మల్ఖన్ సింగ్ కూడ బ్యాంకు వద్దకు వచ్చాడు.
ఎంత నేర చరిత్ర ఉన్న పాత నగదు మార్పిడి కోసం బ్యాంకుకు రాకతప్పలేదు. లొంగిపోయినా....ఆత్మరక్షణ కోసం ఎప్పుడూ తుపాకీని మాత్రం వీడడం లేదు.పాత కరెన్సీ నగదును బ్యాంకులో మార్చుకొని వెళ్ళాడు












Click it and Unblock the Notifications