Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రాజధానిలో దూమ్ సినిమా చూపించిన దొంగలు, ఎన్ని కోట్ల నగలు అంటే!

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో (delhi) భారీ దోపిడీ జరిగింది. నగల దుకాణంలో (jewelery) బీభత్సం సృష్టించిన దుండగులు రూ. 20 కోట్ల నుంచి రూ 25 కోట్ల విలువైన బంగారు ఆభరణాలతో పరారయ్యారు. దక్షిణ ఢిల్లీలోని (delhi) జంగ్‌పూర్ సమీపంలోని భోగల్ ప్రాంతంలోని ఉమ్రావ్ జ్యువెలర్స్‌లో (jewelery)కోట్లాది రూపాయల దోపిడీ జరగడం దేశ రాజధానిలో కలకలం రేపింది.

దీనికితోడు సీసీటీవీలతో (cctv)పాటు పటిష్టమైన భద్రతా వ్యవస్థ ఉన్నప్పటికీ ఈ భారీ దోపిడీని అడ్డుకోవడంలో పోలీసులు, జువెలర్స్ (jewelery)షోరూమ్ యాజమాన్యం విఫలం కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అసలు విషయానికి వస్తే ఈ నగలు షోరూమ్ గురించి పూర్తి సమాచాం తెలిసిన వాళ్లే ఈ దోపిడీకి పాల్పడి ఉండొచ్చని పోలీసు (police) అధికారులు అనుమానిస్తున్నారు. భారీ దోపిడీకి ప్లాన్ సిద్ధం చేసిన ముఠా అందులో మొదటి భాగంగా జ్యువెలరీ (jewelery) షాపు (ఉమ్రావ్ జ్యువెలర్స్) సీసీటీవీలను (cctv) డిస్‌కనెక్ట్ చేసింది.

 Thieves looted Rs 20 crore jewelery in movie style from gold jewelery showroom in Delhi

తరువాత టెర్రస్ నుండి 4 అంతస్తుల భవనంలో ఉన్న ఈ నగల దుకాణంలోకి ప్రవేశించారు. తర్వాత మెట్లు దిగి గ్రౌండ్‌ ఫ్లోర్‌కు చేరుకోగా అక్కడ ఓ జ్యువెలరీ షాపు (jewelery)స్ట్రాంగ్‌ రూం ఉందని తెలిసింది. ఆతర్వాత స్ట్రాంగ్ రూంలోకి వెళ్లేందుకు స్ట్రాంగ్ రూం గోడకు పెద్ద రంధ్రం వేశారు. కోట్లాది రూపాయల విలువైన బంగారు నగలు ఇక్కడ భద్రపరిచారు. దీంతో పాటు షోరూంలో కస్టమర్లు చూసేందుకు ఉంచిన బంగారు నగలను (jewelery) కూడా దొంగలు ఎత్తుకెళ్లారు.

సోమవారం దుకాణానికి సెలవు అని పోలీసులు అన్నారు. ఆదివారం సాయంత్రం షోరూంకు తాళం వేసిన బంగారు నగల యాజమాన్యం తరువాత ఇంటికి వెళ్లిపోయారని తెలిసింది. యథావిధిగా వ్యాపారం ప్రారంభించేందుకు మంగళవారం ఈరోజు ఉదయం షోరూం (jewelery) తలుపులు తెరిచి చూడగా చోరీ జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. దొంగలు చోరీ చేసి వెళ్లిపోయే ముందు సీసీటీవీలో (cctv) రికార్డయిన వాటిని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు.

ఆదివారం హిరియానాలోని అంబాలాలో ఇదే తరహాలో సహకార బ్యాంకులోకి చొరబడిన దొంగలు నగలు, ఇతర విలువైన వస్తువులను దోచుకెళ్లారు. బ్యాంకులోకి ప్రవేశించేందుకు గ్యాస్ కట్టర్‌తో గోడకు రంధ్రం చేసి 32 లాకర్లను పగులగొట్టినట్లు పోలీసులు (cctv) తెలిపారు వీకెండ్ లో బ్యాంకు (jewelery) మూసి ఉండడంతో సోమవారం ఉదయం చోరీ జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+