'పేద ప్రజల కోసమే ఈ ప్రభుత్వం,' బీజేపీ ఎంపీలతో ప్రధాని మోడీ: ముఖ్యాంశాలు
న్యూఢిల్లీ: అదివారం ఢిల్లీలో బీజేపీ కార్యగోష్ఠిని ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ పార్టీ ఎంపీలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమానికే ఎన్టీఏ ప్రభుత్వం అంకితమైందన్నారు. సంక్షేమ పథకాలపై ఎంపీలకు వివరించారు. మనపై ప్రజలకు నమ్మకం ఉందని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ఆయన సూచించారు.
ముఖ్యాంశాలు:
* భారత్లో బలమైన ప్రతిపక్షముంటేనే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు.
* యెమెన్లో చిక్కుకున్న భారతీయులను స్వదేసానికి సురక్షితంగా తరలించామన్నారు.
* దీనిపై మంత్రి వికె సింగ్ సమర్థవంతంగా పనిచేశారని అన్నారు.
* అవినీతిరహిత భారత్ను నిర్మించాలన్నేద తన లక్ష్యమని అన్నారు.
* అంతరిక్షం, అణుశక్తి రంగంలో భారత్ తనదైన ముద్ర వేసుకుందన్నారు.
* కెనడా నుంచి భారత్కు ఐదేళ్ల పాటు యూరేనియం సరఫరా చేసేందుకు ఒప్పందం కుదిరిందన్నారు.
* భారత్లో పెట్టుబడులకు వివిధ దేశాలు ఆసక్తి చూపుతున్నాయన్నారు.
* పేదలను ధనికులుగా మార్చడమే మన లక్ష్యమని అన్నారు.
* దళితులు, గిరిజనుల పిల్లలు విద్యకు దూరమవుతున్నారని అన్నారు.
* ఇలాంటి వారి కోసం బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు.
* పేదలకు ఇళ్లు, విద్యుత్ అందించడం తన కల అని, అందుకు ఎంపీలంతా సమిష్టిగా కృషి చేయాలన్నారు.
* గ్రామీణ వికాస్ యోజనలో ఎంపీలు భాగస్వాములవడం ఇదే తొలిసారని గుర్తు చేశారు.
* దేశంలోని 4 లక్షల మంది ప్రజలకు గ్యాస్ సబ్సిడీ ఇవ్వడం ద్వారా ప్రభుత్వానికి రూ. 200 కోట్ల లబ్ధి చేకూరిందన్నారు.
* ధనికులు గ్యాస్ రాయితీలు వదులుకోవడం ద్వారా పేదలకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు.
* దీంతో దేశంలోని ఎక్కువ మంది పేదలకు గ్యాస్ సరఫరా చేసేందుకు వీలు కలుగుతుందన్నారు.
* ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన్ పథకాన్ని విజయ వంతం చేసినందుకు బ్యాంకులకు అభినందనలు తెలిపారు.
* దీంతో బ్యాంకుల్లో 14,000 వేల కోట్లు జమ అయ్యాయి. నగదు డిపాజిట్ చేయడం అలవాటుగా మారిందన్నారు.
* పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యయ వందో పుట్టిన రోజు సందర్భంగా పేద ప్రజల కోసమే ప్రభుత్వం పనిచేస్తుందని ప్రజలు గుర్తించేలా పనులు చేయాలని సూచించారు.