అడ్డుకుంటే రథచక్రాల కింద తలలు నలిగిపోతాయ్: బీజేపీ లాకెట్ వ్యాఖ్యలు
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో బీజేపీ (భారతీయ జనతా పార్టీ) రథయాత్రను ఎవరైనా అడ్డుకోవాలని చూస్తే వారి తలలు రథం చక్రాల కింద నలిగిపోతాయని బీజేపీ నాయకురాలు ఒకరు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బెంగాల్లో బీజేపీ రథయాత్ర చేపట్టబోతోంది. దీనిపై అధికార టీఎంసీ పార్టీ కుట్రలు చేస్తోందని భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు లాకెట్ ఛటర్జీ స్పందించారు. బెంగాల్లో తమ పార్టీ చేపట్టబోతున్న రథయాత్రను ఎవరైనా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే బాగుండదని హెచ్చరించారు. డిసెంబర్ 5, 6, 7 తేదీల్లో రాష్ట్రంలో రథయాత్ర చేపట్టాలని బీజేపీ భావిస్తోంది.

పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా ఈ యాత్రను ప్రారంభిస్తారు. చివరి రోజు కోల్కతాలో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీకి ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి.
రాష్ట్రంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ తమ రథయాత్ర ఉద్దేశమని, అయితే ఈ యాత్రను అడ్డుకోవడానికి ఎవరైనా ప్రయత్నిస్తే తీవ్ర చర్యలు ఉంటాయని, వారి తలలు రథ చక్రాల కింద పడి నలిగిపోతాయని హెచ్చరించారు.
ఛటర్జీ వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ నేత పార్థా ఛటర్జీ మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా బీజేపీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. బీజేపీ విభజన రాజకీయాలను ప్రజలు తిప్పికొడతారన్నారు.
-
ఆసుపత్రిలో సోనియా గాంధీ అడ్మిట్: హుటాహుటిన రాహుల్, ప్రియాంక: అబ్జర్వేషన్ లో -
కవిత కొత్త పార్టీకి ముహూర్తం ఫిక్స్.. రామయ్య ఆశీస్సులతో.. -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్












Click it and Unblock the Notifications