మూడేళ్ళుగా మహిళపై ముగ్గురు సామూహిక అత్యాచారం
మూడేళ్ళుగా ఓ 29 ఏళ్ళ మహిళను ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేస్తున్నారు.గత ఏడాది డిసెంబర్ వరకు ఆమెపై లైంగిక దాడిని కొనసాగించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసుకొని విచారణ చేపట
థానే :మూడేళ్ళుగా ఓ 29 ఏళ్ళ మహిళను ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేస్తున్నారు.గత ఏడాది డిసెంబర్ వరకు ఆమెపై లైంగిక దాడిని కొనసాగించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసుకొని విచారణ చేపట్టారు.
భయందర్ టౌన్ షిప్ కు చెందిన బాధితురాలితో నిందితులు ముగ్గురు స్నేహంగా ఉండేవారు. 2013 లో ఏప్రిల్ ఓ ఫంక్షన్ సందర్భంగా నిందితులు మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చారు. ఈ కూల్ డ్రింక్ తాగి ఆమె అపస్మారక స్థితిలోకి చేరింది.
ఆమె అపస్మారకస్థితిలోకి చేరగానే నిందితుల్లో ఒక్కడుఆమెపై అత్యాచారం చేశాడు. అటు తర్వాత వరుసగా మరో ఇద్దరు నిందితులు కూడ ఆమెపై అత్యాచారం చేశారు. ఆ తర్వాత వేరే గదిలోకి మార్చి ఆమెపై అత్యాచారానికి పాల్పడేవారు.
మూడేళ్ళుగా ఆమెపై ముగ్గురు అత్యాచారానికి పాల్పడుతున్నారు. ముంబాయిలోని పొవాయ్ పోలీస్ స్టేషన్ లో బాధితురాలు ఫిర్యాదుచేసింది. కేసు నమోదుచేసుకొని విచారణ చేస్తున్నారు పోలీసులు