వార్ వన్ సైడ్, ఎన్నికలకు దూరంగా బీజేపీ, మోదీతో ఢీకొట్టి ఏకగ్రీవం, సిద్దూ,డీకే దెబ్బ!
బెంగళూరు/న్యూఢిల్లీ: 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో టిక్కెట్లు దక్కకపోవడంతో హైకమాండ్ మీద తిరుగుబాటు చేసిన పలువురు బీజేపీ నేతలు విధాన పరిషత్ సభ్యత్వ స్థానానికి రాజీనామా చేశారు. ఇప్పుడు కర్ణాటకలో ఖాళీగా ఉన్న మూడు విధాన పరిషత్ సభ్యుల స్థానాలకు జూన్ 30న ఎన్నిక జరగనుంది. ఇప్పటికే శాసనమండలి సభ్యుల స్థానాలకు కాంగ్రెస్లో భారీ పోటీ నెలకొనగా, అసెంబ్లీ ఎన్నికల అనంతరం మూడు స్థానాలు అధికార పార్టీ కాంగ్రెస్కు దక్కనున్నాయి.
విధానపరిషత్ టికెట్ కోసం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, మహిళా నేతలు లాబీయింగ్ చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ లో జరిగిన చర్చ అనంతరం కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిన జగదీశ్ శెట్టర్, మంత్రి బోస్ రాజ్, తిప్పన్నప్ప కమకనూర్ లకు ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వాలని నాయకులు డిసైడ్ అయ్యారు. ముగ్గురు నాయకులు ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకున్నారు.

శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలైన మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్కు శాసనమండలి సభ్యుడిగా కాంగ్రెస్ అవకాశం కల్పించింది. ఇప్పుడు మాజీ సీఎం జగదీష్ షెట్టర్ సహా ముగ్గురు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ నుంచి జగదీష్ శెట్టర్, మంత్రి బోస్ రాజ్, తిప్పన్నప్ప కమకనూర్ ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేశారు. అయితే బీజేపీ, జేడీఎస్ పార్టీల నుంచి ఎవరూ పోటీ చేయకపోవడంతో ముగ్గురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
శాసనమండలి సభ్యులుగా ఉన్న బాబూరావు చించన్సూర్, ఆర్. శంకర్, లక్ష్మణ్ సవదిలకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి బీజేపీ హైకమాండ్ టిక్కెట్లు ఇవ్వకపోవడంతో కొంతకాలం క్రితం వారి పదవులుకు రాజీనామాలు చెయ్యడంతో ఖాళీ అయిన మూడు ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలను ప్రకటించింది. జూన్ 30న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగాల్సి ఉంది.
అయితే బీజేపీ, జేడీఎస్ పార్టీల నుంచి ఎవరూ బరిలోకి దిగకపోవడంతో కాంగ్రెస్కు చెందిన ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక ఎన్నికల సంఘం ఈ ముగ్గురి పేర్లను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. కర్ణాటక శాసనమండలి సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్, మంత్రి బోస్ రాజ్ శుక్రవారం విధానసౌదలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుతం కర్ణాటక శాసనమండలిలో కాంగ్రెస్కు 24 మంది ఎమ్మెల్సీలు, బీజేపీకి 34 మంది ఎమ్మెల్సీలు, జేడీఎస్కు 8 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. ఒక స్వతంత్ర పార్టీ ఎమ్మెల్సీ కూడా ఉన్నారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications