పీఎంవో డిప్యూటీ సెక్రటరీగా ఐఏఎస్ అమ్రపాలి నియామకం...
పీఎంవో కార్యాలయంలో కొత్తగా ముగ్గురు ఐఏఎస్ అధికారులు నియమితులయ్యారు. ఈ మేరకు కేబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా నియమితులైన ఐఏఎస్ అధికారుల్లో మధ్యప్రదేశ్ 2004 కేడర్కి చెందిన రఘురాజ్ రాజేంద్రన్,ఆంధ్రప్రదేశ్ 2010 కేడర్కు చెందిన అమ్రపాలి కాట,ఉత్తరాఖండ్ 2012 కేడర్కి చెందిన మంగేష్ గిల్దియాల్ ఉన్నారు.
Recommended Video
ఐఏఎస్ రఘురాజ్ రాజేంద్రన్ పీఎంవో కార్యాలయ డైరెక్టర్గా నియమితులయ్యారు. ఇంతకుముందు ఆయన స్టీల్,పెట్రోలియం,సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ప్రైవేట్ సెక్రటరీగా సేవలందించారు.

మరో ఐఏఎస్ అమ్రపాలి కాట ప్రస్తుతం కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శిగా వ్యవహరిస్తుండగా... తాజాగా పీఎంవో డిప్యూటీ సెక్రటరీగా నియమితులయ్యారు. ఇక అంతకుముందు ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసిన ఐఏఎస్ మంగేష్ గిల్దియాల్ తాజాగా పీఎంవో అండర్ సెక్రటరీగా నియమితులయ్యారు.
కాగా,ఐఏఎస్ అమ్రపాలి గతంలో వరంగల్ జిల్లా కలెక్టర్గా,వికారాబాద్ సబ్ కలెక్టర్గా,రంగారెడ్డి జాయింట్ కలెక్టర్గా,రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిణిగా సేవలందించిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జన్మించిన అమ్రపాలి చెన్నై ఐఐటీ నుంచి బీటెక్ పూర్తి చేశారు. ఆ తర్వాత బెంగళూరులోని ఐఐఎం నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. 2010లో ఆమె ఐఏఎస్గా ఎంపికయ్యారు. వరంగల్ కలెక్టర్గా సేవలందించిన సమయంలో ఆమె చాలామంది అభిమానులను సంపాదించుకున్నారు. స్థానికంగా కొంతమంది ఆమె విగ్రహాన్ని సైతం ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications