బెంగళూరులో 'నిఫా' కలకలం: మూడు అనుమానిత కేసులు, ముగ్గురూ నర్సులే!
Recommended Video

బెంగళూరు: దేశమంతా ఇప్పుడు 'నిఫా' వైరస్ కారణంగా ఆందోళన చెందుతోంది. తాజాగా బెంగళూరులోనూ మూడు నిఫా అనుమానిత కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒక కేసు సోమవారం నమోదవగా.. మరో రెండు మంగళవారం నమోదయ్యాయి. ఈ ముగ్గురూ నర్సులే కావడం గమనార్హం. ఇటీవల వీరు కేరళకు తరుచూ వెళ్లిరావడం వల్ల వారికి జ్వరం మొదలైందని వైద్యులు చెప్పారు.
ఈ ముగ్గురి పేషెంట్స్ బ్లడ్ శాంపిల్స్ ని మణిపాల్ సెంటర్ ఫర్ రీసెర్చ్(ఎంసీవీఆర్)కి పంపించినట్టు తెలిపారు. ఆ రిపోర్టులు వస్తే గానీ వారికి నిఫా సోకింది లేనిది నిర్దారించడం కష్టం. ఈ ముగ్గురు నర్సులు బెంగళూరులోని ప్రైవేటు ఆసుపత్రుల్లో పనిచేస్తున్నారని తెలుస్తోంది. నగరంలోని చాలా ఆసుపత్రుల్లో కేరళ నుంచి వచ్చిన నర్సులే పనిచేస్తున్నారని, వీరు తరుచూ వారి స్వస్థలాలకు వెళ్లి వస్తుంటారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే వారికి నిఫా సోకిందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

'వాళ్లు కేరళ వెళ్లాక వారికి జ్వరం మొదలైంది. తిరుగు ప్రయాణంలో వాంతులు చేసుకున్నారు. ఇప్పటికైతే జ్వరం మాత్రమే ఉంది. అయినా ముందస్తు జాగ్రత్తతో బ్లడ్ శాంపిల్స్ టెస్ట్ సెంటరుకు పంపించాం. చాలావరకు నిఫా నెగటివ్ వచ్చే అవకాశం ఉంది' అని డా. బీజీ ప్రకాశ్ కుమార్ తెలిపారు.
-
రేపే ఐపీఎల్ ఓపెనర్: మెట్రో రైల్ లో ఫ్రీ ట్రావెల్: మంత్రులకూ -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..!












Click it and Unblock the Notifications