OMICRON: కొత్తగా మూడు రాష్ట్రాల్లో ప్రవేశం- మహారాష్ట్రలో అధికంగా 32 : దేశంలో 73కు చేరిన కేసుల సంఖ్య..!!

ప్రపంచ దేశాలకు సవాల్ గా మారిన ఓమిక్రాన్ వేరియంట్ ఇప్పుడు భారత్ లోనూ వేగంగా విస్తరిస్తోంది. తాజాగా తమిళనాడు, తెలంగాణ..పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఓమిక్రాన్ కేసులు వెలుగులోకి వచ్చాయి. దేశం లో అధికంగా మహారాష్ట్రాలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇప్పటి వరకు మహారాష్ట్రలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 32గా నమోదైంది. కాగా, దేశ వ్యాప్తంగా కేసులు 73 కు చేరుకున్నాయి. అబుదాబి నుంచి హైదరాబాద్ మీదుగా పశ్చిమ బెంగాల్ కు వచ్చిన ఏడేళ్ల బాలుడుకు ఓమిక్రాన్ నిర్ధారణ అయింది.

Recommended Video

    Omicron Variant : Center On Booster Dose | Omicron Cases In India || Oneindia Telugu
    మరో మూడు రాష్ట్రాల్లో ఓమిక్రాన్ కేసులు

    మరో మూడు రాష్ట్రాల్లో ఓమిక్రాన్ కేసులు


    కాగా, తెలంగాణలో డిసెంబర్ 12న హైదరాబాద్‌లో దిగిన కెన్యాకు చెందిన 24 ఏళ్ల మహిళ, సోమాలియాకు చెందిన 23 ఏళ్ల వ్యక్తికి ఈ వేరియంట్‌కు పాజిటివ్‌గా తేలింది. తమిళనాడులో, కొన్ని రోజుల క్రితం నైజీరియా నుండి వచ్చిన 47 ఏళ్ల వ్యక్తి, అతని ఆరుగురు కుటుంబ సభ్యులతో పాటు, కొత్త వేరియంట్‌కు పాజిటివ్ పరీక్షించారు, ఇది రాష్ట్రంలో మొదటి కేసుగా గుర్తించబడింది. డిసెంబర్ 10న నైజీరియా నుంచి దోహా మీదుగా అక్కడికి చేరుకున్న ప్రయాణికుడికి కోవిడ్-19 పాజిటివ్ అని, అతని కుటుంబ సభ్యులలో ఆరుగురు కూడా వైరస్‌కు పాజిటివ్‌గా పరీక్షించారని వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి తెలిపారు.

    రిస్కు దేశాల నుంచి వచ్చే వారికి పరీక్షలు

    రిస్కు దేశాల నుంచి వచ్చే వారికి పరీక్షలు


    తరువాత, ప్రయాణీకుడికి ఓమిక్రాన్ పాజిటివ్ అని తేలింది. మహారాష్ట్రాలో తాజాగా గుర్తించిన నాలుగు కేసుల్లో ఒకరు మహిళ మరియు ముగ్గురు పురుషులు - అందరూ 16 ఏళ్ల నుండి 67 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు. వచ్చే నెల నుంచి మహారాష్ట్రాలో ఓమిక్రాన్ వేరియంట్ మరింతగా పెరిగే అవకాశం ఉందని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖాధికారులు అంచనా వస్తున్నారు. రిస్కు దేశాల నుంచి వచ్చే ప్రయాణీకులకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పని సరి చేసారు. వారి పరీక్ష ఫలితాలు వెల్లడైన తరువాతనే వారిని బయటకు పంపుతున్నారు.

    విమానయాన శాఖ తాజా నిర్ణయం

    విమానయాన శాఖ తాజా నిర్ణయం


    రిస్కు దేశాలుగా గుర్తించిన ప్రాంతాల నుంచి భారత్ కు వచ్చే ప్రయాణీకులు ఈ నెల 20వ తేదీ నుంచి ఆర్టీపీసీఆర్ పరీక్షల కోసం ముందుగానే బుక్ చేసుకోవాలని విమానయాన శాఖ స్పష్టం చేసింది. కేంద్ర ఆరోగ్య శాఖ రిస్కు దేశాలుగా గుర్తించిన వాటిలో యూకేతో పాటుగా, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, బోట్స్వానా, జింబాబ్వే, టాంజానియా, హాంకాంగ్, చైనా, ఘనా, మారిషస్, న్యూజిలాండ్ మరియు ఇజ్రాయెల్‌ ఉన్నాయి. ఇక, భారత్ లోని ఆరు విమానాశ్రయాల్లో ఈ ఆంక్షలు తప్పనిసరి చేసారు. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లో లో వీటిని అమలు చేస్తున్నారు. ఇప్పటికే రాజస్థాన్, కర్ణాటక, గుజరాత్, ఆంధ్రప్రదేశ్.. ఢిల్లీ తో పాటుగా చండీగఢ్ కేంద్ర పాలిత ప్రాంతాల నుండి కూడా ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+