రేపు తిరుపతికి మోడీ: సైన్స్ కాంగ్రెస్ ప్రారంభోత్సవం, వెంకన్న దర్శనం..
తిరుపతిలో నిర్వహించనున్న 104వ భారత సైన్స్ కాంగ్రెస్ సదస్సును మంగళవారం నాడు ప్రధాని మోడీ ప్రారంభిస్తారు.
విజయవాడ: భారత ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం నాడు ఏపీలో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా.. తిరుపతిలో నిర్వహించనున్న 104వ భారత సైన్స్ కాంగ్రెస్ సదస్సును ఆయన ప్రారంభిస్తారు. శ్రీవేంకటేశ్వర విశ్వ విద్యాలయం వేదికగా రేపటి నుంచి 7వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరగనుంది.
సైన్స్ కాంగ్రెస్ సదస్సు అనంతరం మోడీ శ్రీ వేకంటేశ్వరస్వామిని దర్శించుకుంటారు. వెంకన్న దర్శనం తర్వాత తిరిగి ఢిల్లీకి పయనమవుతారు. కాగా, సైన్స్ కాంగ్రెస్ సదస్సుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా హాజరవుతారు.

వివిధ దేశాలకు చెందిన పలువురు నోబెల్ బహుమతి గ్రహీతలు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. సభలో పాల్గొనున్న మోడీ తన సందేశాన్ని ఇవ్వనున్నారు. ప్రసంగం అనంతరం నోబెల్ గ్రహీతలతో ఆయన ముచ్చటిస్తారు.
సైన్స్ కాంగ్రెస్ సదస్సు కోసం మొత్తం 10,500 మంది రిజిస్టర్ చేసుకోవడం విశేషం. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి పలు దేశాలకు చెందిన 200మంది శాస్త్రవేత్తలు విచ్చేయనున్నారు.
-
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు












Click it and Unblock the Notifications