తమిళనాడులో షాకింగ్.. ఏపీ యువతిపై పోలీసులు అత్యాచారం..!
చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే కామాంధులుగా మారిన ఘటన సంచలనం రేపుతోంది. మహిళలకు, యువతులకు అండగా ఉండాల్సింది పోయి వారిపైనే అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ దారుణమైన ఘటన తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్ర ప్రాంతమైన తిరువణ్ణామలైలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
సెప్టెంబర్ 30 మంగళవారం రోజు తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఓ యువతి స్పృహ కోల్పోయి ఉండటాన్ని స్థానిక గ్రామస్థులు గమనించారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా వాళ్లు యువతిని తిరువణ్ణామలైలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీకి తరలించి వైద్య చికిత్స అందించారు. అయితే అంతకుముందు పెట్రోలింగ్ లో ఉన్న ఇద్దరు పోలీసులు ఏపీకి చెందిన 18 ఏళ్ల యువతిని బెదిరించి పొదల్లోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం.
ఏం జరిగింది..?
సెప్టెంబర్ 30 మంగళవారం తెల్లవారుజామున ఆంధ్రా నుంచి తల్లీకూతుళ్లు టమాటలతో తిరువణ్ణామలై వెళుతున్న ఒక గూడ్స్ వాహనంలో ఎక్కారు. అయితే ఆ గూడ్స్ వాహనంలో తల్లీకూతుళ్లు, డ్రైవర్ తప్ప మరెవరూ లేరు. వాహనం రాత్రి సమయానికి ఎంథాల్ బైపాస్ వద్దకు చేరుకుంది. ఈ క్రమంలో బైపాస్పై పెట్రోలింగ్ చేస్తున్న సురేశ్ రాజ్, సుందర్ అనే ఇద్దరు పోలీసులు వాహనాన్ని ఆపారు. తనిఖీ చేయాలని చెప్పారు. తల్లీకూతురు కిందకు దిగారు. ఈ క్రమంలో ఆ గూడ్స్ వాహనం వ్యక్తి పారిపోయాడు.

తల్లీకూతురు అక్కడే ఉన్నారు. వారిని ప్రశ్నించగా తిరువణ్ణామలై దేవస్థానానికి వెళ్తున్నట్టు తెలిపారు. అయితే తమ వాహనం మీద తీసుకెళ్తామని వారికి మాయ మాటలు చెప్పారు. విల్లుపురం రోడ్డుకు తీసుకెళ్లారు. అక్కడే ఓ కానిస్టేబుల్ తల్లిని ముళ్లపొదల్లోకి నెట్టివేయగా.. మరొకరు యువతిని శ్మశాసవాటిక ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇంతలో తల్లి తేరుకుని స్థానికంగా ఉన్న ఇటుక బట్టీల ప్రాంతానికి వెళ్లి జరిగిన విషయం చెప్పగా వాళ్లు 108కు ఫోన్ చేశారు. ఇంతలో కూతురు కూడా అక్కడికి చేరుకోవడంతో ఇద్దర్నీ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో పోలీసులు అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం. బాధితుల ఫిర్యాదు మేరకు కానిస్టేబుళ్లను అధికారులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications