శశికళ కోటా పూర్తి: 3 గం.లు నిరీక్షించినా మంత్రులకు నో
అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళను కలవడానికి బెంగళూరు పరప్పన అగ్రహార జైలుకు వెళ్లిన తమిళనాడు మంత్రులకు చుక్కెదురయింది. చిన్నమ్మను కలిసేందుకు వారికి అనుమతి నిరాకరించారు.
చెన్నై: అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళను కలవడానికి బెంగళూరు పరప్పన అగ్రహార జైలుకు వెళ్లిన తమిళనాడు మంత్రులకు చుక్కెదురయింది. చిన్నమ్మను కలిసేందుకు వారికి అనుమతి నిరాకరించారు.
మూడు రోజుల క్రితం ముఖ్యమంత్రిగా పళనిస్వామి, మరికొందరు మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. అందులో డీ శ్రీనివాసన్, సెంగొట్టాయన్, సెల్లూర్ రాజులు కూడా ఉన్నారు.
ఈ ముగ్గురు మంత్రులు మంగళవారం నాడు శశికళను కలిసేందుకు చెన్నై నుంచి బెంగళూరు వచ్చారు. అక్కడి సెంట్రల్ జైలుకు వెళ్లారు. అయితే వారికి అధికారులు అనుమతి నిరాకరించారు.

అందుకే అనుమతి నిరాకరణ
డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజనర్స్ ప్రకారం.. జైలులో ఉన్న ఖైదీని కలిసేందుకు వారానికి రెండు రోజులు మాత్రమే అవకాశమిస్తారు. ఈ కారణంగా శశికళను కలిసేందుకు తమిళనాడు మంత్రులకు అనుమతి నిరాకరించారు.

శశికళ కోటా అయిపోయింది
శశికళ వారం క్రితం జైలుకు వెళ్లారు. అప్పటి నుంచి ఆమెను పలువురు నేతలు కలుస్తున్నారు. సోమవారం నాడు ఆమె అక్క కొడుకు, అన్నాడీఎంకే పార్టీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి దినకరన్ కూడా కలిశారు. వరుసగా పలువురు ఆమెను కలుస్తుండటంతో ఈ వారానికి ఆమె కోటా పూర్తయింది.

3 గంటలు ఎదురు చూసిన మంత్రులు
ముగ్గురు మంత్రులు కూడా శశికళ కోసం మూడు గంటల పాటు నిరీక్షించారు. అయితే, నిబంధల ప్రకారం అనుమతి లేదని అధికారులు చెప్పలేదు. వచ్చే వారం వారు రావొచ్చునని చెప్పారు.

జైలు మార్పు కోసం..
తనను బెంగళూరు జైలు నుంచి చెన్నై జైలుకు తరలించాలని శశికళ పిటిషన్ పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ అప్లికేషన్ జైలు అధికారుల వద్ద ఉంది. అయితే, నిపుణులు చెబుతున్న దాని ప్రకారం.. ఇలాంటి దరఖాస్తును ప్రత్యేక కోర్టుకు ఇవ్వాలని అంటున్నారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications