పళనిస్వామి బలనిరూపణ: స్టాలిన్ దీక్ష, రాష్ట్రపతికి 'అసెంబ్లీ' నివేదిక
తమిళనాడు అసెంబ్లీలో విశ్వాస తీర్మానం సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలకు నిరసనగా డీఎంకే నిరాహార దీక్షలను ప్రారంభించింది.
చెన్నై: తమిళనాడు అసెంబ్లీలో విశ్వాస తీర్మానం సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలకు నిరసనగా డీఎంకే నిరాహార దీక్షలను ప్రారంభించింది. తిరుచ్చిలో ఈ ఆందోళన కార్యక్రమాల్ని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ ప్రారంభించారు.
తిరుచ్చి, కాంచీపురం, చైన్నైలో నాలుగుచోట్ల తిరువళ్లూరు, ఇతర ప్రాంతాల్లో వీటిని నిర్వహిస్తున్నారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ దీక్షలు కొనసాగుతాయి.

ఈ దీక్షలకు కాంగ్రెస్, ఐయూఎంఎల్లు మద్దతు తెలిపాయి. తిరుచ్చి దీక్షలో ఐయూఎంఎల్ అధ్యక్షడు ఎం ఖాదర్ మొహిద్దీన్ పాల్గొన్నారు.
రాష్ట్రపతికి నివేదిక
కాగా, గత శనివారం పళనిస్వామి బలనిరూపణ సమయంలో అసెంబ్లీలో జరిగిన పరిణామాలను తమిళనాడు ఇంచార్జ్ గవర్నర్ విద్యాసాగర రావు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి నివేదిక ఇచ్చారు. మరోవైపు, అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై స్టాలిన్ కోర్టుకు వెళ్లారు. ఈ పిటిషన్ను మద్రాస్ హైకోర్టు 27వ తేదీకి వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications