త్వరలో: 11 అంకెలతో కూడిన మొబైల్ నెంబర్లు..కసరత్తు చేస్తున్న ట్రాయ్
త్వరలో 11 అంకెలు ఉన్న మొబైల్ ఫోన్ నెంబర్లు రానున్నాయా...? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇందుకోసం కేంద్రం కూడా ఆలోచిస్తోందని తెలుస్తోంది. టెలికాం రెగ్యులేటర్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా 11 అంకెల మొబైల్ నెంబర్లపై అభిప్రాయాల సేకరణ చేసేందుకు సమాయాత్తమవుతోంది. ఇక దేశంలో జనాభా పెరిగిపోతుండగా అదే సమయంలో మొబైల్ ఫోన్ల వినియోగదారుల సంఖ్యకూడా పెరిగిపోతోంది.
ఇప్పటికే ప్రభుత్వం 13 అంకెలతో కూడిన సిరీస్ను ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్కు కేటాయించింది. 2050నాటికి 2.6 బిలియన్ నెంబర్లు అవసరమవుతాయని ట్రాయ్ చెబుతోంది.2027 నాటికి జానాభాలో భారత్ చైనా జనాభాను దాటుతుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేస్తోంది. 2050 నాటికి 1.64 బిలియన్ జనాభా భారత్ కలిగి ఉంటుందని చెప్పింది.

దేశంలో ప్రస్తుతం 1.2 టెలిఫోన్ కనెక్షన్లు ఉన్నాయి. ఇప్పటికే ట్రాయ్ ఫిక్స్డ్ ల్యాండ్లైన్లకు మొబైల్ సేవలకు ఒక స్థిరమైన నంబరింగ్ విధానం తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. మొబైల్ ఫోన్లు వినియోగించే వారి సంఖ్య 2050 నాటికి 200 శాతం పెరిగితే.. మొబైల్ వినియోగదారుల సంఖ్య దాదాపుగా 3.28 బిలియన్కు చేరుకుంటుందని చెబుతోంది.
ఇక 11 అంకెల మొబైల్ నెంబర్లు అమలు చేసేందుకు సూచనలు ఇవ్వాలని ట్రాయ్ అధికారులను కోరింది. ఫిక్స్డ్ ల్యాండ్ లైన్ ఫోన్లకు 10 అంకెల నెంబర్ కొనసాగిస్తూనే మొబైల్ ఫోన్లకు 11 అంకెలు అమలు విధానంపై సూచనలను కోరింది. మొబైల్ ఫోన్ల ద్వారా డేటా కనెక్షన్ తీసుకునేవారికి 13 నెంబర్లు కేటాయింపును కూడా ఆలోచిస్తోంది.కొత్త నెంబర్ సిరీస్లను 3,5,6 అంకెలతో ప్రారంభించాలని భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న మొబైల్ ఫోన్ నెంబర్లకు 9,8,7 అంకెలతో ప్రారంభమవుతోంది.ఇక దీనిపై ప్రజాభిప్రాయం సేకరించేందుకు అక్టోబర్ 21ని చివరితేదీగా ప్రకటించగా అభిప్రాయాలపై స్పందించేందుకు నవంబర్ 4న చివరితేదీగా ప్రకటించింది.
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications