అఫ్గాన్లో భూకంపం: ఉత్తర భారత్లో ప్రకంపనలు
న్యూఢిల్లీ: ఈశాన్య అఫ్గనిస్తాన్లోని పాకిస్తాన్, కజికిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో శుక్రవారం అర్థరాత్రి భూకంపం సంభవించింది. దీని తీవ్ర రెక్టర్ స్కేలుపై 6.2గా నమోదైంది. ఈ భూకంప ప్రమాదంలో 17 మంది గాయపడ్డారని యుఎస్ జియోలాజికల్ సర్వే శనివారంనాడు వెల్లడించింది.
భూమి కంపించడతో ఆ ప్రాంతంలోని ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భయంకరమైన చలిలో ప్రజలు రాత్రంతా బయటనే జాగారం చేశారు. భూకంప కేంద్రాన్ని 203 కిలోమీటర్ల లోతులో కనుక్కున్నట్లు తెలిపారు. ఈ భూకంపం ప్రభావం భారత్లోనూ పాకిస్తాన్లో కనిపించింది.

భారత్లోని హిమాలయ పర్వత ప్రాంతంలోని రాష్ట్రాలతో పాటు న్యూఢిల్లీలో కూడా స్వల్పంగా భూమి కంపించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. భారత్లోని చండీఘడ్, జైపూర్, ఢిల్లీ సహా ఇతర సమీపం ప్రాంతాల్లో భారీ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.
భారతదేశంలో అర్థరాత్రి దాటిన తర్వాత 12.44 గంటలకు ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించిన దాఖలాలు లేవు.ఢిల్లీలోని ప్రజలు ప్రకంపనలతో భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. జమ్మూ కాశ్మీరులో కూడా ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.
-
ముంబాయి ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి హార్డిక్ ఔట్, కొత్త కెప్టెన్ ఫిక్స్..!? -
అప్పటి వరకూ పాకిస్థాన్ కు నో వాటర్: భారత్ సంచలనం -
భారత పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గుదల.. యుద్ధం కంటే ముందే..! -
కిర్రాక్ ఫీచర్లతో Boat Valour Watch 1R.. ధర ఎంతంటే ?? -
ఏసీ గదుల్లో ఎక్కువగా ఉంటున్నారా- అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు












Click it and Unblock the Notifications