Mysuru: వేదం సకల సంపదలకు మూలం, శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ, హాజరైన టీటీడీ చైర్మన్ !
మైసూరు/ తిరుపతి: మానవుల మనుగడకు అవసరమైన ఇహపర సుఖాలను ప్రసాదించే మంత్రాలు వేదాల్లో ఉన్నాయని, ఇలాంటి వేదాలు సకల సంపదలకు మూలమని శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ ప్రబోధించారు. మైసూరులోని దత్తపీఠంలో టీటీడీ ఆధ్వర్యంలో గత నాలుగు రోజుల నుంచి శ్రీనివాస చతుర్వేద హవనం నిర్వహిస్తున్నారు. శ్రీనివాస చతుర్వేద హవనంలో అన్ని వేదాలలోని మంత్రాలతో యజ్ఞవిష్ణును ఆరాధిస్తున్నారని, వేదం జీవులందరి కోరికలను ప్రసాదించగలిగే శక్తిని కలిగి ఉందని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ చెప్పారు. మానవుల సమస్త కోరికలు ఈనాడు డబ్బుతో ముడిపడ్డాయని భావిస్తున్నారని, మాములుగా ధనాన్ని సంపాదించిన వ్యక్తుల ఇళ్ళలో రెండు తరాలు లేదా మూడుతరాల నిలవడం చూస్తున్నామని, కానీ అమోఘమైన వేదాశీర్వచనాన్ని పొందిన కుటుంబాలలో లక్ష్మీదేవత తొమ్మిది తరాలకు పైగా స్థిరంగా నిలుస్తుందని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ వివరించారు.
మైసూరు దత్త పీరంలో టీటీడీ నిర్వహిస్తున్న శ్రీనివాస చతుర్వేద హవనంలో శ్రీ స్వామీజీ నాలుగో రోజు శనివారం ప్రసంగంలో వేద హవన శక్తిని తెలియజేశారు. శ్రీనివాస చతుర్వేద హవనంలో అన్ని వేదాలలోని మంత్రాలతో యజ్ఞవిష్ణును ఆరాధిస్తున్నారని, వేదం జీవులందరి కోరికలను ప్రసాదించగలిగే శక్తిని కలిగి ఉందని స్వామిజీ చెప్పారు.

మానవుల సమస్త కోరికలు ఈనాడు డబ్బుతో ముడిపడ్డాయని భావిస్తున్నారని, మాములుగా ధనాన్ని సంపాదించిన వ్యక్తుల ఇళ్ళలో రెండు తరాలు లేదా మూడుతరాల నిలవడం చూస్తున్నామని, కానీ అమోఘమైన వేదాశీర్వచనాన్ని పొందిన కుటుంబాలలో లక్ష్మీదేవత తొమ్మిది తరాలకు పైగా స్థిరంగా నిలుస్తుందని వివరించారు. మానవులకు ఉత్తమలోకాలు కూడా కేవలం వేద ఆరాధన వల్లే సులభంగా సాధ్యమవుతుందని, కావున ఈ చతుర్వేద హననం సమస్త శ్రీవారి భక్తులకు ఆయురారోగ్య ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుందని స్వామీజీ వివరించారు.
టీటీడీ ఛైర్మన్శ్రీ వైవీ.సుబ్బారెడ్డి ఈ చతుర్వేద హవనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ వైవీ. సుబ్బారెడ్డి మాట్లాడుతూ ధర్మప్రచారంలో భాగంగా ఆయా ప్రాంతాల్లో స్వామీజీల సహకారంతో ఇలాంటి చతుర్వేద హవనాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమాలు పూర్తి అయిన తరువాత గోపూజ, అశ్వపూజ, మంటపారాధనలతో చతుర్వేద హవనం నిర్వహించారు.
Recommended Video
సాయంత్రం జ్ఞాన యజ్ఞంలో భాగంగా శ్రీ వేంకటేశ్వర ఉన్నత వేదాద్యయన సంస్థ అధికారి డా. ఆకెళ్ళ విభీషణ శర్మ వేద భారతిలో యజ్ఞ విషయాలను, మహిమలను విశ్లేషించారు. నాద యజ్ఞంలో భాగంగా శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమ భజన మండలి బృందం వారు విష్ణు కీర్తనలను, పండరీ భజనలను చక్కగా ఆలపించారు. ఈ కార్యక్రమంలో పలువురు వేదభాష్య పండితులు, వేదపండితులు, భక్తులు పాల్గొన్నారు. మైసూరులోని దత్తపీఠంలో టీటీడీ ఆధ్వర్యంలో గత నాలుగు రోజుల నుంచి శ్రీనివాస చతుర్వేద హవనం నిర్వహిస్తున్నారు. మైసూరులో జరుగుతున్న ఈ కార్యక్రమాలలో పాల్గొనడానికి టీటీడీ చైర్మన్ వైవీ, సుబ్బారెడ్డి హాజరైనారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ!











Click it and Unblock the Notifications