నేను మాహాత్మగాంధీ మనుమడు కాదు, దేశంలో ఎవరు తప్పు చెయ్యలేదు, టీటీవీ దినకరన్ !
ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్న సమయంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న శశికళ కుటుంబ సభ్యులు పైకి మాత్ర మాకేం భయం లేదు అన్నట్లు మాట్లాడుతున్నారు.
చెన్నై: ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్న సమయంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న శశికళ కుటుంబ సభ్యులు పైకి మాత్ర మాకేం భయం లేదు అన్నట్లు మాట్లాడుతున్నారు. చట్టప్రకారం తాము ఆదాయపన్ను చెల్లించినా రాజకీయ కక్ష సాధింపులో భాగంగా ఐటీ శాఖ అధికారులను అడ్డం పెట్టుకుని దాడులు చేయిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
శనివారం చెన్నైలో శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ మీడియాతో మాట్లాడుతూ దేశంలో తప్పు చెయ్యని వారు ఎవరైనా ఉన్నారా ? అని ప్రశ్నించారు. నేను మాహాత్మాగాంధీ మనుమడు కాదని, అలాగని తనను వేలేత్తి చూపిస్తున్న వారు నిజాయితీపరులు కాదని అన్నారు.

తమిళనాడులోని ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వం అవినీతిని వేలేత్తి చూపించినందుకే మా కుటుంబ సభ్యుల మీద ఆదాయపన్ను శాఖను అడ్డంపెట్టుకుని దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. తమిళనాడులో ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదని టీటీవీ దినకరన్ జోస్యం చెప్పారు.
ఎడప్పాడి పళనిసామి, పన్నీర్ సెల్వం కేంద్ర ప్రభుత్వ పెద్దలతో కుమ్మక్కు అయ్యారని, దాని ఫలితంగానే శశికళ కుటుంబ సభ్యుల మీద వేధింపులు ఎక్కువ అయ్యాయని టీటీవీ దినకరన్ ఆరోపించారు. ఆదాయపన్ను శాఖ అధికారుల సోదాల్లో ఎలాంటి అక్రమాస్తులు బయటపడలేదని, చట్టపరంగానే మేము వ్యాపారాలు చేస్తున్నామని టీటీవీ దినకరన్ సమర్థించుకున్నారు.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications