మన్నార్ గుడి మాఫియా ఫ్యామిలీ ఫైట్: ఎమ్మెల్యేలు జంప్ కావడానికి ఆయనే కారణం!
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత లేకపోవడంతో అన్నాడీఎంకే పార్టీలో చీలికలు వచ్చిన విషయం తెలిసిందే. పార్టీని, సీఎం కుర్చీని హైజాక్ చేసి తమిళనాడు మీద పెత్తనం చెలాయించాలని చూసిన శశికళ చివరికి బెంగళూరు సెంట్రల్ జైలుకు వెళ్లారు.
శశికళ జైలుకు వెళ్లే సమయంలో తన సోదరి వనితామణి కుమారుడు టీటీవీ దినకరన్ కు పార్టీ ఉప కార్యదర్శి పగ్గాలు అప్పగించి వెళ్లారు. దినకరన్ పిచ్చిచేష్టలతో తమిళనాడు ప్రభుత్వం అతలాకుతలం అయ్యింది. ఇటీవల సీఎం పళనిసామి, పన్నీర్ సెల్వం వర్గాలు ఒక్కటి అయ్యాయి.

తమిళనాడు ప్రభుత్వం గాడినపడుతున్న సమయంలో టీటీవీ దినకరన్ 22 మంది ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకుని ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి మీద తిరుగుబాటు చేయించారు. పుదుచ్చేరిలోని రిసార్ట్ లో ఉన్న 5 మంది ఎమ్మెల్యేలు ఆదివారం అక్కడి నుంచి గోడదూకేశారు.
ఆ ఐదు మంది ఎమ్మెల్యేలు శశికళ సోదరుడు దివాకరన్ కు సన్నిహితంగా ఉంటున్నారని తెలిసింది. దివాకరన్ కావాలనే ఐదు మంది ఎమ్మెల్యేలను గోడ దూకించారని టీటీవీ దినకరన్ మండిపడుతున్నారు. ఎమ్మెల్యేలు జంప్ కావడానికి దివాకరన్ కుమారుడు జయంత్ కారణం అని తెలుసుకున్న దినకరన్ తన మేనమామ దివాకరన్ మీద కారాలు మిరియాలు నూరుతున్నారని, ఆయనకు పార్టీతో ఏమి సంబంధం అని ప్రశ్నిస్తున్నారని అన్నాడీఎంకే వర్గాలు అంటున్నాయి.
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications