తుర్కియే-సిరియా భూకంపం: 3,500కు పెరిగిన మృతుల సంఖ్య... కొనసాగుతున్న సహాయక చర్యలు

తుర్కియే, సిరియా సరిహద్దుల్లో సోమవారం చాలా తీవ్రమైన భూకంపం వచ్చింది.
ఈ విపత్తులో రెండు దేశాల్లో మృతుల సంఖ్య 3,500 దాటినట్లు అధికారులు చెబుతున్నారు.
తుర్కియేలో సుమారు 2,379 చనిపోయారని, 14,483 మంది గాయపడ్డారని ఆ దేశ వైస్ ప్రెసిడెంట్ వెల్లడించారు. సుమారు 4,748 భవనాలు కూలి పోయినట్లు తెలిపారు.
ఇక సిరియాలో సుమారు 1,444 మంది చనిపోయిట్లు వార్తలు వస్తున్నాయి.
శిథిలాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.
ఈ విపత్తులో మరణాల సంఖ్య 8 రెట్లు ఎక్కువగా ఉండొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) అంచనా వేసింది.
అమెరికా వంటి దేశాలు తుర్కియేకు సాయం చేసేందుకు ముందుకు వచ్చాయి.
ఇతర దేశాల నుంచి కూడా సహాయక బృందాలు తుర్కియే, సిరియాలకు చేరుకుంటున్నాయి.
ఎంత త్వరగా శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తిస్తే ప్రాణనష్టం అంత తక్కువగా ఉంటుందని లేదంటే ఆ సంఖ్య పెరగొచ్చని నిపుణులు చెబుతున్నారు.
వెంట వెంటనే భూకంపాలు
తుర్కియే తూర్పున 26 కి.మీ దూరంలో ఉన్న నూర్దా నగరంలో గాజియంటెప్లో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది.
7.4 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ జియోసైన్సెస్ (జీఎఫ్జెడ్) ప్రకటించిందని వార్తా సంస్థ రాయిటర్స్ పేర్కొంది.
జీఎఫ్జెడ్ ప్రకారం భూకంపం కేంద్రం భూమికి 10 కిలోమీటర్ల దిగువన ఉంది. అదే సమయంలో భూకంప కేంద్రం భూమికి 11 మైళ్ల దిగువన ఉందని యూఎస్జీఎస్ తెలిపింది.
ఇది జరిగిన కొద్దిసేపటికే సెంట్రల్ తుర్కియేలో రెండోసారి భూమి కంపించింది.
దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.7గా నమోదైందని యూఎస్జీఎస్ వెల్లడించింది. దీని కేంద్రం భూమికి 9.9 కిలోమీటర్ల దిగువన ఉన్నట్లు తెలిపింది.

ఇవి కూడా చూడండి:
- ఆంధ్రప్రదేశ్- ఆ ఊరి పిల్లలు గుర్రాలపై సవారీ చేస్తూ బడికి వెళ్తున్నారు
- తెలంగాణ- కరెంటు బిల్లులో ఏసీడీ చార్జీల వివాదం ఏంటి.. కట్టాల్సింది ఇంటి యజమానా లేక కిరాయిదారా-
- షార్ట్ సెల్లింగ్- కొనకుండానే షేర్లను ఎలా అమ్ముతారు... లాభాలు ఎలా వస్తాయ్
- బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ ISWOTY: అయిదుగురు నామినీలు వీళ్ళే
- గౌతమ్ అదానీ వ్యాపార సామ్రాజ్యాన్ని షేక్ చేసిన హిండెన్-బర్గ్ కథ ఏంటి, దాన్ని నడిపే అండర్సన్ ఎవరు-












Click it and Unblock the Notifications