పలుమార్లు గర్భం,అబార్షన్: జియాఖాన్ మృతిలో ట్విస్ట్
ముంబై: బాలీవుడ్ నటి, మోడల్ జియాఖాన్ కేసులో మరో కొత్త కోణం వెలుగు చూసింది. పలుమార్లు గర్భం ధరించడం, అబార్షన్ కారణంగా ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని తెలుస్తోంది. సిబిఐ బుధవారం నాడు జియాఖాన్ కేసులో ఛార్జీషీట్ దాఖలు చేసింది.
ఈ అభియోగ పత్రంలో కొత్త కోణం వెలుగు చూసిందని తెలుస్తోంది. జియాఖాన్ ఆత్మహత్యకు సూరజ్ పంచోలీ కారణమని అందులో పేర్కొన్నారని తెలుస్తోంది. సూరజ్ తమ విచారణలో కల్పిత కథలు చెబుతున్నట్లుగా సిబిఐ అందులో పేర్కొంది.
జియాఖాన్ పలుమార్లు గర్భం ధరించడం, సూరజ్ బలవంతంతో అబార్షన్ చేయించుకుందని, దీంతో డిప్రెషన్కు లోనైందని, చివరకు ఆమె ఆత్మహత్య చేసుకుందని తెలిపారని తెలుస్తోంది. ఓసారి, తాను గర్భం దాల్చిన విషయం గురించి సూరజ్కు చెప్పిన సమయానికి.. ఆమె నాలుగు వారాల గర్బిణీ.

దీంతో, ఇరువురు కలిసి వైద్యుడి వద్దకు వెళ్లి అబార్షన్ చేయించుకోవచ్చునని నిర్ణయించుకున్నారు. అయితే, మెడిసిన్స్ వల్ల ఫలితం లేకుండా పోయింది. దీంతో వారు గైనకాలజిస్ట్ను సంప్రదించారు. సదరు వైద్యుడు వివిధ కలయికల డ్రగ్స్ సూచించాడు.
కాగా, జియాఖాన్ ఆత్మహత్య కేసులో సీబీఐ బుధవారం అభియోగ పత్రం దాఖలు చేసింది. బాలీవుడ్కు చెందిన ఆదిత్య పంచోలీ, జరీనా వహెబ్ దంపతుల కుమారుడు సూరజ్ పంచోలీ ఈ కేసులో నిందితుడుగా ఉన్నారు. బాంబే హైకోర్టు నుంచి గత ఏడాది ఈ కేసును దిగువ కోర్టుకు బదిలీ చేశారు.
ఈ కేసులో సీబీఐ విచారణ ఎంతవరకు వచ్చిందో చెప్పాలని పదిహేను రోజుల కిందట కోర్టు కోరింది. దీంతో ఈ ఛార్జీషీట్ దాఖలు చేశారు. సీబీఐ ఈ కేసులో దర్యాప్తు పూర్తిచేసినా అభియోగ పత్రం దాఖలు చేయలేదంటూ ప్రత్యేక మహిళా న్యాయస్థానం న్యాయమూర్తి నవంబరు 18న ప్రస్తావించారు.
-
26/11 దాడుల నుంచి తృటిలో తప్పించుకున్నా: ధురంధర్ విలన్ -
పాప టాలెంట్ చూపిస్తోందిగా..! -
ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 17 లిప్ లాక్స్.. ఫస్ట్ మూవీ లోనే ! -
'ధురంధర్'కు కొత్త తలనొప్పి.. హైకోర్టుకు పంచాయితీ! -
ఏపీ సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ భేటీ..! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications