మృత్యువు ఒడిలో తల్లి...మృత్యుంజయులు ఆ పిల్లలు
ఇండో ..పాట్నా రైలు ప్రమాదం అనేక కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదం తో 90 మందికి పైగా చనిపోయారు.
కాన్పూర్ : ఇండో ..పాట్నా రైలు ప్రమాదంలో ఒక్కో కుటుంబ విషాదగాథ వెలుగులోకి వస్తున్నాయి.. ఈ ప్రమాదంతో అనేక కుటుంబాల్లో విషాదాలు నెలకొన్నాయి. ఓ యువతి వివాహం నిలిచిపోయింది. మరో వైపు ఈ ప్రమాదం నుండి ఇద్దరు పిల్లలు సురక్షితంగా బయటపడ్డారు. కాని, తల్లి మాత్రం చనిపోయింది.తల్లి కోసం ఆ చిన్నారులు పడుతున్న ఇబ్బందిని చూసి స్థానికులు కంటతడిపెట్టారు.
ఇండోర్ పాట్నా రైలు ప్రమాద ఘటన జరిగిన తర్వాత సహాయక చర్యల్లో పాల్గొంటున్న సిబ్బంది క్షతగాత్రులను ఆసుపత్రులకు చేరుస్తున్నారు. బోగీల్లో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో 90 మందికి పైగా చనిపోయారు. అయితే ఈ ఘటన నుండి ఇద్దరు చిన్నారులు సురక్షితంగా బయటపడ్డారు.

సహయక చర్యలను చేపడుతున్న సిబ్బందికి మృతదేహల మద్య ఇద్దరు చిన్నారులు ప్రాణాలతో ఉండడం ఆశ్చర్యానికి గురయ్యారు.ఎస్ 3 బోగీ కింద ఇద్దరు చిన్నారులు ఇరుక్కున్నారు. వీరిని రైల్వే సిబ్బంది సురక్షితంగా బయటకు తీశారు.
ఈ చిన్నారులు బతికి ఉన్నారు. అయితే ఈ చిన్నారుల కిందనే వారి తల్లిని గుర్తించారు రెస్క్యూటీమ్. అయితే అప్పటికే ఆమె చనిపోయింది. తల్లి కోసం ఆ చిన్నారుల పడుతున్న ఇబ్బందిని చూసి స్థానికులు కంటతడిపెట్టారు.












Click it and Unblock the Notifications