పట్టాలు తప్పిన టాయ్ రైలు, బ్రిటన్వాసుల మృతి
సిమ్లా: కల్కా నుంచి సిమ్లాకు యాత్రికులను తీసుకువెళుతున్న చిన్న రైలు పట్టాలు తప్పడంతో ఇద్దరు బ్రిటన్ మహిళా పర్యాటకులు మృతి చెందారు. ఈ ఘటనలో పద్దెనిమిది మంది గాయపడ్డారు.
నాలుగు బోగీలు ఉన్న చిన్న రైలు (టాయ్ ట్రైయిన్) 41 మంది విదేశీ ప్రయాణికులను తీసుకొని వెళుతుండగా హిమాచల్ ప్రదేశ్లోని తక్సల్ స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని రైల్వే అధికారులు తెలిపారు.
చివరి మూడు బోగీలు పట్టాలు తప్పడంతో బ్రిటన్కు చెందిన లొరైనే టన్నార్(53), హెలెన్ కాల్డర్(58)లు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన వారిని మోహాలిలోని ఆసుపత్రికి తరలించామని పేర్కొన్నారు.
మూడు విమానాలకు తప్పిన ముప్పు
నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులకు మూడు విమానాల పైలట్లకు మధ్య సమాచార ప్రసారంలో పదకొండు నిమిషాల పాటు అవరోధం ఏర్పడింది. ఆ సమయంలో ఎలాంటి ప్రమాదం జరగకుండా నియంత్రించగలిగామని అధికారులు తెలిపారు.