వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీలో గూండాలు, ఒంటరిగా పోటీ: మోడీకి షాకిచ్చిన శివసేన

బీజేపీకి శివసేన అధినేత ఉద్దవ్ థాకరే షాకిచ్చారు. రానున్న మునిసిపల్ కార్పోరేషన్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో శివసేన ఒంటరిగా పోటీ చేస్తుందని చెప్పారు.

|
Google Oneindia TeluguNews

ముంబై: బీజేపీకి శివసేన అధినేత ఉద్దవ్ థాకరే షాకిచ్చారు. రానున్న మునిసిపల్ కార్పోరేషన్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో శివసేన ఒంటరిగా పోటీ చేస్తుందని చెప్పారు. తాను, తమ కార్యకర్తలు ఒంటరిగా పోటీకి సిద్ధంగా ఉన్నారని ఉద్దవ్ చెప్పారు.

తమకు మంచి కార్యకర్తలు ఉన్నారని, వారు వెన్నుపోటు పొడవరని, నేరుగా పోరాడుతారని చెప్పారు. ఓసారి నేను నిర్ణయం తీసుకుంటే, ఎవరూ అడగలేరన్నారు. బీజేపీలో గూండాలు ఉన్నారని, శివసేనలో సైనికులు ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Uddhav Thackeray rules out alliance with BJP in future

తాను అలయెన్స్ కోసం ఎవరినీ అడగనని చెప్పారు. ఎవరి తలుపు తట్టేది లేదని చెప్పారు. తమకు ఎవరి జాలి అవసరం లేదని చెప్పారు. మున్సిపల్ కార్పోరేషన్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో మాత్రం ఒంటరిగా పోటీ చేస్తామన్నారు.

కాగా, బీఎంసీ (బృహన్ ముంబై కార్పోరేషన్) ఎన్నికల్లో 227 సీట్లకు గాను బీజేపీ 114 స్థానాలు అడుగుతోంది. శివసేన మాత్రం 60 సీట్లకు మించి ఇచ్చేందుకు సిద్ధంగా లేదు. బీఎంసీ ఎన్నికలు ఫిబ్రవరి 21వ తేదీన జరగనున్నాయి.

English summary
Shiv Sena chief Uddhav Thackeray on Thursday said that there won't be any alliances with BJP in the upcoming civic elections across Maharashtra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X