బీజేపీలో గూండాలు, ఒంటరిగా పోటీ: మోడీకి షాకిచ్చిన శివసేన
బీజేపీకి శివసేన అధినేత ఉద్దవ్ థాకరే షాకిచ్చారు. రానున్న మునిసిపల్ కార్పోరేషన్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో శివసేన ఒంటరిగా పోటీ చేస్తుందని చెప్పారు.
ముంబై: బీజేపీకి శివసేన అధినేత ఉద్దవ్ థాకరే షాకిచ్చారు. రానున్న మునిసిపల్ కార్పోరేషన్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో శివసేన ఒంటరిగా పోటీ చేస్తుందని చెప్పారు. తాను, తమ కార్యకర్తలు ఒంటరిగా పోటీకి సిద్ధంగా ఉన్నారని ఉద్దవ్ చెప్పారు.
తమకు మంచి కార్యకర్తలు ఉన్నారని, వారు వెన్నుపోటు పొడవరని, నేరుగా పోరాడుతారని చెప్పారు. ఓసారి నేను నిర్ణయం తీసుకుంటే, ఎవరూ అడగలేరన్నారు. బీజేపీలో గూండాలు ఉన్నారని, శివసేనలో సైనికులు ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాను అలయెన్స్ కోసం ఎవరినీ అడగనని చెప్పారు. ఎవరి తలుపు తట్టేది లేదని చెప్పారు. తమకు ఎవరి జాలి అవసరం లేదని చెప్పారు. మున్సిపల్ కార్పోరేషన్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో మాత్రం ఒంటరిగా పోటీ చేస్తామన్నారు.
కాగా, బీఎంసీ (బృహన్ ముంబై కార్పోరేషన్) ఎన్నికల్లో 227 సీట్లకు గాను బీజేపీ 114 స్థానాలు అడుగుతోంది. శివసేన మాత్రం 60 సీట్లకు మించి ఇచ్చేందుకు సిద్ధంగా లేదు. బీఎంసీ ఎన్నికలు ఫిబ్రవరి 21వ తేదీన జరగనున్నాయి.
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications