ఇండియాలో 22 ఫేక్ యూనివర్సిటీలు - యూజీసీ
యూజీసీ డేటా ప్రకారం దేశవ్యాప్తంగా మొత్తం 22 నకిలీ విశ్వవిద్యాలయాలు (Fake Universities) పనిచేస్తున్నట్లు వెల్లడైంది. వీటిలో అత్యధికంగా తొమ్మిది సంస్థలు ఢిల్లీలో ఉండగా.. ఐదు ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి. మిగిలిన నకిలీ యూనివర్సిటీలు కేరళ, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి రాష్ట్రాల్లో కూడా ఉన్నట్లు యూజీసీ గణాంకాలు చూపిస్తున్నాయి. దీంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
కాగా ఢిల్లీలోని నకిలీ యూనివర్సిటీలు తరచుగా బ్రోకర్ల నెట్వర్క్ల ద్వారా విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని ఆకర్షిస్తున్నాయి. అంతే కాకుండా నకిలీ విశ్వవిద్యాలయాలు విద్యార్థులను సులభంగా మోసగించడానికి అధికారిక సంస్థలను పోలిన పేర్లను ఉపయోగిస్తున్నాయి. ఈ సంస్థలు తమ పేర్లలో 'నేషనల్', 'టెక్నాలజీ', 'మేనేజ్మెంట్', 'ఇన్స్టిట్యూట్' వంటి పదాలను వాడుతూ, ప్రభుత్వ గుర్తింపు ఉన్నట్లు భ్రమ కలిగిస్తున్నాయి.

అలానే ఉత్తరప్రదేశ్లో నకిలీ సంస్థలు 'విద్యాపథ్', 'పరిషత్', 'ఓపెన్ యూనివర్సిటీ' వంటి పదాలను ఉపయోగించి గ్రామీణ ప్రాంతాల విద్యార్థులను సైతం మోసాలకు గురిచేస్తున్నాయి. విద్యార్థులు తమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నకిలీ సంస్థల బారిన పడకుండా ఉండేందుకు యూజీసీ పలు సూచనలు చేసింది. విద్యార్థులు ఏదైనా సంస్థలో చేరే ముందు, అది యూజీసీ చట్టంలోని సెక్షన్ 2(ఎఫ్) కింద లేదా సెక్షన్ 3 కింద 'డీమ్డ్ యూనివర్సిటీ'గా గుర్తించబడిందో లేదో తప్పకుండా తనిఖీ చేయాలని కోరింది.
ఆయా కోర్సులకు సంబంధించి ఏఐసీటీఈ (ఇంజినీరింగ్, మేనేజ్మెంట్), పీసీఐ (ఫార్మసీ), ఎన్ఎంసీ (మెడికల్) వంటి సంబంధిత కౌన్సిల్స్ నుండి సంస్థకు, కోర్సులకు అనుమతులు ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలని తెలిపింది. యూజీసీ తమ అధికారిక వెబ్సైట్లో గుర్తించబడిన విశ్వవిద్యాలయాలు, నకిలీ విశ్వవిద్యాలయాల జాబితాను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుందని.. విద్యార్థులు ఆ జాబితాను తప్పక పరిశీలించాలని యూజీసీ సూచించింది. నకిలీ సంస్థల్లో చేరితే, ఆ డిగ్రీల ఆధారంగా ఉద్యోగాలు లేదా ఉన్నత విద్య కోసం ఇతర దేశాలకు వెళ్లడం సాధ్యం కాదని హెచ్చరించింది.
మరోవైపు ఢిల్లీ లోని కోట్లా ముబారక్పూర్లో ఉన్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ ఇంజినీరింగ్ సంస్థపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఈ సంస్థకు అనుమతులు లేని డిగ్రీ కోర్సులను నిర్వహిస్తోందని, దీని ద్వారా అందించే డిగ్రీలకు ఎలాంటి విలువ ఉండదని యూజీసీ స్పష్టం చేసింది. ఈ సంస్థ ఏ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ చట్టాల కింద కూడా ప్రారంభించబడలేదని యూజీసీ తెలిపింది.
-
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
ముంబాయి ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి హార్డిక్ ఔట్, కొత్త కెప్టెన్ ఫిక్స్..!? -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications