Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అక్రమ సంబంధం, ఇంట్లో చిత్రహింసలు, పిల్లలతో కలిసి భార్య ఏం చేసిందంటే ?, పక్క రాష్ట్రంలో !

కుటుంబ సభ్యులు, బంధువులు నిశ్చయించిన పెళ్లి చేసుకున్న దంపతులు చాలా సంతోషంగా పెళ్లి చేసుకున్నారు. వివాహం చేసుకున్న తరువాత దంపతులు చక్కగా సంసారం చెయ్యడంతో ఇద్దరు పిల్లలు పుట్టారు. అక్రమ సంబంధం కారణంగా భర్తతో గొడవపడిన భార్య ఆమె పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది. ఇదే సందర్బంలో ముగ్గురు శవాలై కనిపించడం కలకలంరేపింది.

Unable to bear the torture of her husband, the wife committed suicide by jumping into the well with her two !

ఇద్దరు కూతుళ్లతో కలిసి కన్న తల్లి భర్త వేధింపులతో బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. కర్ణాటకలోని బెళగావి జిల్లా రాయబాగ్ తాలూకా సుల్తాన్‌పూర్ గ్రామ శివారులో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు కూతుళ్లతో కలిసి బావిలో దూకి తల్లి ఆత్మహత్య చేసుకుంది. సరస్వతి కిరవే అలియాస్ సరస్వతి (26) అనే మహిళ ఆమె పిల్లలు దీపికా (7), రితిక (4) బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారని పోలీసు అధికారులు తెలిపారు.

Unable to bear the torture of her husband, the wife committed suicide by jumping into the well with her two !

మహారాష్ట్రలోని సాంగ్లీకి చెందిన కిరాణ్ అనే యువకుడికి సరస్వతికి పెళ్లి చెయ్యాలని ఇరువైపుల కుటుంబ సభ్యులు మాట్లాడుకున్నారు. 2016లో కుటుంబ సభ్యులు నిర్ణయించిన ముహూర్తానికి కిరణ్, సరస్వతిల వివాహం అయ్యింది. అయితే కిరణ్ కు వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని ఆమెతో ఎంజాయ్ చేస్తున్నాడని తెలిసింది. ప్రియురాలితో ఎంజాయ్ చేస్తున్న కిరణ్ తరువాత ఇంటికి వెళి అతని భార్య సరస్వతిని చిత్రహింసలకు గురి చేస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి,

చాలా కాలం నుంచి కిరణ్ అతని భార్య సరస్వతిని చిత్రహింసలకు గురి చేస్తున్నాడని తెలిసింది. భర్త కిరణ్ వేధింపులతో విసిగి వేసారిన సరస్వతి ఆమె స్వగ్రామమైన బెళగావి జిల్లాలోని సుల్తాన్‌పూర్‌కు వెళ్లిపోయింది. జీవితంపై విరక్తి పెంచుకున్న సరస్వతి ఆమె ఇద్దరు పిల్లలను బావిలోకి తోసి ఆమె బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. బావిలోంచి ముగ్గురి మృతదేహాలను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు.

Unable to bear the torture of her husband, the wife committed suicide by jumping into the well with her two !

మృతురాలు సరస్వతి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్త కిరణ్ నిత్యం ఇంట్లో సరస్వతిని టార్చర్ పెట్టాడని, అతని వేధింపులకు విసిగిపోయి సరస్వతి పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడిందని ఆరోపించారు. 8 నెలల క్రితం భర్త కిరణ్ తో గొడవ పడిన సరస్వతి పుట్టింటికి తిరిగి వచ్చిందని, అప్పటి నుంచి భార్యాపిల్లలను చూసేందుకు భర్త ఒక్కరోజు కూడా సరస్వతి ఇంటికి వచ్చే ప్రయత్నం చేయలేదు. తరచూ ఫోన్ చేసి వేధించేవాడని, దీంతో మనస్తాపానికి గురైన సరస్వతి ఆమె పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హారూగేరి పోలీసులు సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరించి కేసు నమోదు చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+