Education:ఒకటవ తరగతిలో పిల్లలను చేర్చాలంటే కనీస వయస్సు ఎంతో తెలుసా..!
ఢిల్లీ: ఒకటవ తరగతి విద్యార్థులకు వయస్సు తప్పనిసరిగా ఆరేళ్లు ఉండాలంటూ కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి ఒకటవ తరగతిలో ప్రవేశం పొందేందుకు విద్యార్థులకు కనీస వయసును ఆరేళ్లుగా నిర్ణయించినట్లు అధికారులు వెల్లడించారు. నూతన జాతీయ విద్యా విధానం (National education policy) ప్రకారం తొలి ఐదేళ్లు విద్యార్థులకు నేర్చుకునే అవకాశం కల్పించాలని ఇందుకోసం గట్టి పునాది ఉండాలని అభిప్రాయపడింది. ఇందుకోసం తొలి మూడు సంవత్సరాలు ప్రీస్కూల్ విద్య, ఆ తరువాత ఒకటవ తరగతి రెండవ తరగతులు ఉంటాయని వెల్లడించింది.
ఈ కొత్త విధానం వల్ల పిల్లల్లో సొంతంగా నేర్చుకోవడం, చదువుకోవడం వంటివి అలవడుతాయని అదే సమయంలో పిల్లలు కూడా అభివృద్ధి చెందుతారని కేంద్రం భావిస్తోంది. అంగన్వాడీలు లేదా ప్రభుత్వ, ప్రభుత్వ-సహాయక, ప్రైవేట్ మరియు NGOలలో చదువుతున్న పిల్లలందరికీ మూడు సంవత్సరాల నాణ్యమైన ప్రీస్కూల్ విద్యను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుందని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడింది.

ఇందుకోసమే ప్రీ స్కూళ్లను నడపాలంటూ విద్యాశాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఈ క్రమంలోనే కేంద్ర విద్యాశాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. ఒకటవ తరగతి ప్రవేశానికి కనీస వయస్సు ఆరేళ్లు లేదా అంతకంటే ఎక్కువగా ఉండాలని సూచనలు ఇచ్చింది.ప్రస్తుతం ఒకటవ తరగతి ప్రవేశం కోసం పిల్లలకు కనీస వయసు ఐదేళ్లుగా ఉంది. ఈ వయస్సును ఆరేళ్లకు పెంచాలనే అంశం గతంలో చర్చకు వచ్చింది. అయితే జాతీయ విద్యా విధానంను ఆయా రాష్ట్రాలు అమలు చేస్తే ఒకటవ తరగతి ప్రవేశంకు కనీస వయసు ఆరేళ్లు ఉండాలన్న నిబంధనను తీసుకురాగలమని గతంలో కేంద్రం వివరణ ఇచ్చింది. ఒకప్పుడున్న విద్యావిధానం 10+2 స్ట్రక్చర్గా ఉండేది. అయితే నూతన విద్యా విధానం ప్రకారం 5+3+3 స్ట్రక్చర్గా మారింది. ఇందులో 3 నుంచి 8 ఏళ్ల వయసున్న వారిని ఫౌండేషనల్ స్టేజ్ కింద విభజించడం జరిగింది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి చర్చ లేదా ఆదేశాలు ఇవ్వలేదు.
ఇక బీజేపీ పాలిత రాష్ట్రమైన కర్నాటకలో మాత్రం గతేడాది జూన్ నుంచి ఒకటవ తరగతి ప్రవేశం కోసం పిల్లలకు కనీస వయస్సు ఆరేళ్లు ఉండాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంతకుముందు కనీస వయస్సు ఐదేళ్ల ఐదునెలలుగా ఉండేది. విద్యా హక్కు చట్టం, జాతీయ విద్యా విధానంను అనుసరించి ఈ సవరణ చేసినట్లు కర్నాటక ప్రభుత్వం పేర్కొంది.
కేంద్రీయ విద్యాలయ సంఘటన్లో ఒకటవ తరగతి ప్రవేశం కోసం కనీస వయస్సు ఆరేళ్లు ఉండాలంటూ గతేడాది నిబంధన తీసుకురావడంతో పిల్లల తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించారు. అంతకుముందు కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటవ తరగతి ప్రవేశం కోసం కనీస వయసు ఐదేళ్లుగా ఉన్నింది. అయితే ఢిల్లీ హైకోర్టులో వీరికి చుక్కెదురైంది. చాలా తక్కువ వయసున్న పిల్లలను స్కూళ్లకు పంపరాదంటూ న్యాయస్థానం అభిప్రాయపడింది. ఇలా చేస్తే పిల్లలపై ఒత్తిడి ఉంటుందని అది వారి ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉందని న్యాయస్థానం అభిప్రాయపడింది.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications