చేతిలో చిల్లిగవ్వ ఉండట్లేదు- సినిమాలు చేస్తేనే డబ్బులొస్తాయ్: రాజీనామాకు రెడీ
ప్రముఖ మలయాళ నటుడు, కేంద్రమంత్రి సురేష్ గోపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి నుంచి తప్పుకోవాలని భావిస్తున్నానని, పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. సినిమాల్లోకి పూర్తిస్థాయిలో నటించాలని కోరుకుంటోన్నానని వ్యాఖ్యానించారు. ఫిల్మ్ ఇండస్ట్రీకి దూరం కావడం, రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తోన్నందున ఆదాయం కూడా బాగా తగ్గిందని పేర్కొన్నారు.
కేరళ నుంచి బీజేపీ తరఫున లోక్సభకు ఎన్నికైన తొలి ఎంపీ ఆయనే. గత ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో త్రిశూర్ నుంచి ఆయన ఘన విజయం సాధించారు. ఆ తరువాత పెద్దగా సినిమాల్లో కనిపించలేదు. కేరీర్ ఉచ్ఛస్థితిలో ఉన్నప్పుడే రాజకీయాల్లోకి అడుగు పెట్టారాయన. 2016లో బీజేపీలో చేరారు. సినిమాలకు దూరం అయ్యారు. తొలుత రాజ్యసభకు నామినేట్ అయ్యారు. అనంతరం లోక్ సభలో ఎంట్రీ ఇచ్చారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేబినెట్ లో పెట్రోలియం, పర్యాటక సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తాజాగా కన్నూర్లో బీజేపీ నిర్వహించిన ఓ సమావేశంలో మాట్లాడారు. సినీ కెరీర్ను వదిలేయాలని, కేంద్ర మంత్రిని కావాలని ఎప్పుడూ కోరుకోలేదని సురేష్ గోపీ స్పష్టం చేశారు. మళ్లీ సినిమాల్లో నటించాలని ఉందని, అదే తన చివరి మజిలీ అని పేర్కొన్నారు. సినిమాలకు దూరమైనప్పటి నుంచి తన ఆదాయం కూడా గణనీయంగా తగ్గిందని చెప్పారు.
కేంద్ర మంత్రి పదవి నుంచి తాను వైదొలగాల్సి వస్తే ఆ స్థానాన్ని సదానందన్ మాస్టర్తో భర్తీ చేయాలని సురేష్ గోపీ తెలిపారు. అలా చేయడం వల్ల కేరళ రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టినట్టు అవుతుందని తాను గట్టిగా నమ్ముతున్నానని చెప్పారు. సదానందన్ మాస్టర్ ఉపాధ్యాయుడిగా పని చేశారు. బీజేపీ కేరళ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. గతంలో జరిగిన రాజకీయ దాడిలో రెండు కాళ్లు కోల్పోయారు. ఆయన రాజ్యసభ సభ్యుడు కూడా.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications